amp pages | Sakshi

అవయవదాన కుటుంబానికి ఆర్థిక సహాయం

Published on Sun, 11/13/2016 - 01:40

- జగన్ పిలుపు మేరకు స్పందించిన ప్రవాస భారతీయులు
- సాయం అందజేసిన జగన్
 
 సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందగా ఆయన అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చిన వ్యక్తి కుటుంబానికి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కొందరు ఆర్థిక సాయం చేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన పెల్లేటి సుబ్బారెడ్డి (35) గత అక్టోబర్ 2వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను  నారాయణ ఆసుపత్రిలో చేర్పించగా బ్రెరుున్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. నిరుపేద కుటుంబీకులైనప్పటికీ ఎంతో ఔదార్యంతో సుబ్బారెడ్డి అవయవాలను వారు దానం చేశారు. అయితే చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవిస్తున్న సుబ్బారెడ్డికి భార్య శివకుమారి, తల్లి సుబ్బమ్మ, పిల్లలు సమీర (9 ఏళ్లు), జశ్వంత్ (7) ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం కావ డం, ఇంటిపెద్ద చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం లేదా ఇతరుల నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదు.

ఈ విషయం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా... కొందరు పార్టీ నేతలు, అమెరికాలోని ప్రవాసాంధ్రులు  ముందుకు వచ్చారు. సుబ్బారెడ్డి పిల్లలిద్దరి పేరిట చెరో రూ.లక్ష , ఆయన తల్లి పేరిట రూ .60 వేలు మొత్తం రూ 2.6 లక్షలు ఆర్థిక సాయం చేశారు. వర్జీనియాకు చెందిన పాటిల్ సత్యారెడ్డి  పిల్లల చదువులకయ్యే ఫీజులు చెల్లించడానికి అంగీకరించారు. వర్జీనియాకే చెందిన రాంప్రసాద్‌రెడ్డి బయ్యపరెడ్డి ఆ కుటుంబానికి అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను కూడా ఆ కుటుంబానికి చేయూతనందిస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ ఆర్థిక సాయాన్ని శనివారం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆ కుటుంబానికి అందజేశారు. ఆదుకున్న వారందరినీ జగన్ అభినందించారు. కార్యక్రమంలో పుట్టపర్తి వైఎస్సార్ కాంగ్రెస్ నేత డాక్టర్ హరికృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తమను ఆదుకున్నందుకు సుబ్బారెడ్డి సతీమ ణి శివకుమారి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 సంధ్యారాణి కుటుంబానికి జగన్ హామీ
 వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్ విద్యార్థిని బి.సంధ్యారాణి తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. సంధ్యారాణి తల్లిదండ్రులు బాల సత్తయ్య, ప్రమీల, అన్న రవికుమార్‌లు శనివారం జగన్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమార్తె చావుకు కారణం అరుున ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని వారు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.లక్ష్మిని సస్పెండ్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సలామ్‌బాబు, కో- కన్వీనర్ సీవీ సారుునాథ్‌రెడ్డిలు కూడా ఉన్నారు.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు