amp pages | Sakshi

ఈ గెలుపు జగన్‌దే

Published on Fri, 05/24/2019 - 15:42

సాక్షా, ఒంగోలు సిటీ : జగన్‌ పడిన కష్టం ఫలించింది. ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమాన్ని చేయాలనుకొనే మంచి మనస్సుకున్న ఆశయం నెరవేరింది. తన విజయం జగన్‌దే. ఈ గెలుపు ఆయన ఇచ్చిందేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్వేగంగా అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి అభిమానుల కోరిక మేరకు వారి వద్దకు విచ్చేశారు. ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. నవరత్నాలే జగన్‌ను గెలిపించాయన్నారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ముందు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల కార్యక్రమాలను అమలు చేస్తారన్నారు. మంచి ముఖ్యమంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకుంటారన్నారు. రానున్న పాతికేళ్లు ఆయనే సీఎం అన్నారు. ఆయన జనం మనిషి. సీఎం పదవిలో ఉన్నా నిత్యం జనం సమస్యలనే ఆలోచిస్తుంటారన్నారు. జనం బాధలు, కష్టాలు వారి నష్టాలను తెలుసుకొనేందుకే పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో జనం పడ్తున్న బాధలను స్వయంగా చూశారన్నారు. ఎవరో చెబితే విని ప్రజలు ఇలా ఉన్నారని అనుకొనే నాయకుడు కాదని చెప్పారు. నేరుగా జనంతో కలిసి వారితో నడిచి వారితోనే నిత్యం జీవించిన జగన్‌ ఇక తన పాలనలో ఒక్కరంటే  ఒక్కరైనా ఇబ్బంది పడకుండా జనరంజకంగా పాలన అందిస్తారన్నారు. జగన్‌ రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజల వద్దకు వచ్చే ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. 
అభిమాన నీరాజనం
బాలినేని శ్రీనివాసరెడ్డికి అభిమానులు నీరాజనం పలికారు. గురువారం  సాయంత్రం అబిమానులను పలుకరించేందుకు ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆయనను అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కలిశారు. బాలినేనిని అభిమానులు తమ భుజాలకెత్తుకున్నారు. కేకలు వేశారు. కేరింతలు కొట్టారు. బాలినేనిని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి బయటకు భుజాలపైనే తెచ్చారు. అక్కడి నుంచి వీఐపీ రోడ్డులోని బాలినేని ఇంటికి వచ్చారు. అక్కడ మహిళా ప్రతినిధులు, నాయకులు గులాము కొట్టారు. బాలినేనికి రంగు చల్లి రంగులో ముంచెత్తారు. మహిళా నాయకులు గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, కావూరి సుశీల తదితరుల ఆధ్వర్యంలో బాలినేనికి హారతులిచ్చారు. బాలినేని సతీమణి బాలినేని శచీదేవి, బాలినేని సోదరి రమణమ్మలు ఎర్రనీళ్లతో దిష్ఠి తీశారు. అభిమానుల నడుమ విజయోత్సవాన్ని పంచుకున్నారు. తిరిగి వీవీఫ్యాట్స్‌ లెక్కింపు కోసం గురువారం సాయంత్రం తిరిగి ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లారు.  బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా బాలినేని అభిమానులు నగరంలో మతాబులు కాల్చారు. అభిమానులు నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

Videos

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)