amp pages | Sakshi

పేటలో జన్మభూమి రసాభాస

Published on Sat, 10/11/2014 - 00:20

నరసరావుపేట వెస్ట్
 పట్టణంలోని వన్నూరుకుంట పార్క్ సమీపంలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు నిర్వహించిన జన్మభూమి-మాఊరు పదకొండో వార్డు సభ రసాభసాగా మారింది. సభకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాగానే జై కోడెల అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై గోపిరెడ్డి, జై జగన్ అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ షేక్ మున్నీపై పథకం ప్రకారం టీడీపీకి చెందిన మహిళలు దాడిచేసి ఆమెను కిందపడేశారు.

ఇరువర్గాలను అదుపు చేసేందుకు సీఐ ఎం.వి.సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీ సులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. సభ సజావుగా జరిగేందుకు అవకాశం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి.శ్రీనివాసరావు, డీఈ సీతారామారావులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. జన్మభూమి కార్యక్రమం లో భాగంగా వన్నూరుకుంట పార్కు వద్ద ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ డి.శ్రీనివాసరావు అధ్యక్షతన సభను  నిర్వహించేందుకు సమాయుత్తమయ్యారు. సభకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని చూడగానే అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున జై కోడెల అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

అందుకు ప్రతిగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా జై జగన్, జై గోపిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వచ్చేందుకు యత్నించగా సీఐలు ఎం.వి.సుబ్బారావు, బి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ లోకనాథ్ తమ సిబ్బందితో ఇరువర్గాల మధ్య నిలబడి శాంతింపచేసేందుకు యత్నించారు. ఈలోగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ షేక్.మున్నిపై టీడీపీకి చెందిన ఐదుగురు మహిళలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోపోద్రికులయ్యారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన పోలీసులు స్వల్పంగా ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు.

పరిస్థితి చేజారిపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ డీఈ సీతారామారావు ప్రకటించారు. అనంతరం తన వద్దకు వచ్చిన కమిషనర్ డి.శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా మీరు వ్యవహరిస్తే సాయంత్రం 12వ వార్డులో జరిగే సభ కూడా జరపలేరన్నారు.  ఈ సంఘటనలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, జెడ్పీటీసీ నూరుల్‌అక్తాబ్, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు ఎస్‌ఏ హనీఫ్, కొమ్మనబోయిన శంకరయాదవ్, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, పట్టణ  అధికార ప్రతినిధి బాపతు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు మాగులూరి రమణారెడ్డి, మాడిశెట్టి మోహనరావు, పాలపర్తి వెంకటేశ్వరరావు, మాజీ వైస్ చైర్మన్ షేక్ సైదావలి  పాల్గొన్నారు.

Videos

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)