amp pages | Sakshi

గల్ఫ్‌దేశానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

Published on Sat, 06/15/2019 - 10:07

సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : గత పది సంవత్సరాలుగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు రాక పొలం పంట సాగు చేసుకోలేక, రూ.లక్షలు వెచ్చించి అప్పులు చేసి బిడ్డల్ని ప్రయోజకులిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అందిరినీ వదిలి పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్లాడు లక్కిరెడ్డిపల్లె మండలం పందేళ్లపల్లె గ్రామంకు చెందిన సోముగారి లక్షుమయ్య. అక్కడికి వెళ్లి నాలుగు నెలలు కూడా గడవక మునుపే లక్షుమయ్య (34)ను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కువైట్‌లో ఆయన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు  అక్కడి వారు  ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. లక్షుమయ్య మరణవార్త విన్న కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. 14 రోజులుగా భర్త, బంధువులు, మిత్రులు మృతదేహం కోసం కంటిమీద కునుకు లేకుండా ఎప్పుడోస్తాడా అని ఎదురు చూస్తున్నారు. గురువారం అర్థ రాత్రి మృతదేహాన్ని ఇండియాకు పంపినట్లు సమాచారం అందింది.

కువైట్లోని ఇండియాకు చెందిన పలువురు తమ వంతు ఆర్థిక సహాయంతో మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి సహకరించారు. ఇంటికి చేరిన మృతదేహాన్ని చూసిన భార్య పిల్లలు బోరున విలపించారు. నాన్న  మా బాగు కోసం మమ్మల్ని విడిచి వెళ్లావా అంటూ ఇద్దరు కుమార్తెలు కన్నీటిపర్వతమవుతూ దుఖించడం అందరినీ కలచివేసింది. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. 

ఎంపీ సహాయంతో..
కువైట్‌లో మృతి చెందిన లక్షుమయ్య మృతదేహాన్ని మద్రాసు ఎయిర్‌ పోర్టు నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తన సొంత ఖర్చులు వెచ్చించి ప్రత్యేక అంబులెన్సు ద్వారా పందిళ్లపల్లె గ్రామం బురుజుపల్లెకు రప్పించేందు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)