రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దివీస్ లేబోరేటరీస్ వద్ద ఆందోళన
Published on Mon, 01/25/2016 - 09:18
భీమిలి: విశాఖ జిల్లా భీమిలి మండలం సిటీ నగర్లోని దివిస్ లేబొరేటరీస్ పరిశ్రమ ముందు కంచేరుపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. దివిస్ లేబోరేటరీస్ ఇక్కడ మూడో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భీమిలి పంచాయతీ పరిధిలోని కంచేరుపాలెం గ్రామాన్ని ఖాళీ చేయాలని స్థానికులను కంపెనీ కోరుతోంది.
ఒక్కో ఇంటికి పరిహారంగా రూ. 27 లక్షలు ఇస్తామని మధ్యవర్తులుగా టీడీపీ నాయకులను రంగంలోకి దింపింది. అయితే, తాము ఖాళీ చేసేది లేదంటూ గ్రామంలోని 200 కుటుంబాల వారు సోమవారం దివిస్ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కంపెనీ వాహనాలను అడ్డుకున్నారు. కంపెనీకి చెందిన రెండు యూనిట్లతో ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయని, మూడో యూనిట్ వస్తే తాము ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు మండిపడ్డారు.
#
Tags