amp pages | Sakshi

‘వారికి భరోసా ఇచ్చే విధంగా రైతు దినోత్సవం’

Published on Sat, 07/06/2019 - 15:49

సాక్షి, తాడేపల్లి : రైతులకు భరోసా ఇచ్చే విధంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి(జూలై 8)ని రైతు దినోత్సవంగా జరుపుతామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి కార్యక్రమంగా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. తొలిసారి జరిగిన అగ్రికల్చర్‌ మిషన్‌ సమావేశంలో సీఎం సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. ప్రతినెలా విధిగా సమావేశం అవ్వాలని, రైతు సంబంధింత అంశాలను చర్చించాలని అధికారులకు సూచించారన్నారు. మూడు వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇది అగ్రికల్చర్‌ మిషన్‌ పరిధిలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

గతంలో రైతుల మార్కెటింగ్‌ అంశాన్ని పూర్తిగా విస్మరించారని, రెండు వేల కోట్లతో ఏర్పాటు చేసే విపత్తు సహాయ నిధి కూడా ఈ మిషన్‌ పరిధిలోనే ఉండాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత కోసం నియోజకవర్గాని ఒకటి చొప్పున ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు తెలంగాణ తరహాలోనే చెల్లింపులు చేపడతామరని.. పొగాకు, కొబ్బరి రైతులను కూడా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నాఫెడ్‌ కొనుగోలు చేసే కొబ్బరి మార్కెట్‌ సెస్‌ను రద్దు చేశామని తెలిపారు. కౌలు చట్టంలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా ఈ చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. సహకార రుణాలు సక్రమంగా అందించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకులు రైతుల మీదకు ఒత్తిడి తేకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 

Videos

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?