amp pages | Sakshi

లాక్‌డౌన్‌: 50 శాతం కూలి అదనం  

Published on Thu, 04/09/2020 - 08:30

సాక్షి, కాకినాడ: ఆక్వా పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ‘కోవిడ్‌–19’ వైరస్‌ దెబ్బకు సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. లాక్‌డౌన్‌ కారణంగా పది రోజులుగా స్తంభించిన రొయ్యల ప్రాసెసింగ్‌ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనుమతులు మంజూరు చేసింది. కూలీల సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళుతోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రాసెసింగ్‌ యూనిట్ల యాజమాన్యాలతో చర్చించారు. ప్రస్తుతం కూలీలకు ఇస్తున్న కూలి కంటే 50 శాతం అదనంగా అందించాలని సూచించారు. అందుకు ఆయా యూనిట్ల యాజమాన్యాలు అంగీకరించాయి. పనులు చేస్తున్న చోటే కూలీలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చూపిన చొరవతో ఐదు రోజులుగా ఆక్వా ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయి. వాటిని ప్రాసెసింగ్‌ యూనిట్ల యాజమాన్యాలు  కొనుగోలు చేసి భద్రపరుస్తున్నాయి. ప్రొసెసింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎగుమతులు ప్రారంభిస్తారు.

ఏం జరిగిందంటే.. 
కరోనా ప్రకంపనలు జిల్లాలోని ఆక్వా ఉత్పత్తులకు తాకడంతో నెలన్నర రోజులుగా పరిశ్రమ సంక్షోభంలో ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పది రోజులుగా మరింత దారుణంగా మారింది. డిసెంబర్‌లో వచ్చే పంటతో లాభాలు ఆర్జించవచ్చని గంపెడాశలు పెట్టుకున్న సాగుదారులకు ఈ సంక్షోభం కన్నీళ్లు మిగిల్చింది. ధరల పతనానికి తోడు.. ప్రాసెసింగ్‌ యూనిట్లు మూత పడడంతో చెరువుల్లోని రొయ్యల పట్టుబడి చేయలేని స్థితి నెలకొంది. దీనికితోడు దళారులు దీన్ని బూచిగా చూపిస్తూ మరింత ప్రతిష్టంభన సృష్టించారు. దీంతో ఆక్వా రంగం ఆటుపోట్ల మధ్య కొట్టుమిట్టాడింది. 

జిల్లాలో ఇలా.. 
జిల్లాలో 55 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. దాదాపు 25 వేల మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు నడుస్తున్నాయి. ప్రాసెసింగ్‌ కంపెనీల నుంచి కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. భారతదేశం నుంచి యూఎస్‌ఏ, ఈయూ, చైనా, జపాన్‌ వంటి దేశాలకు లక్షల మెట్రిక్‌ టన్నుల్లో సరుకు ఎగుమతి అవుతోంది. ఇందులో అత్యధికంగా యూఎస్‌ఏకు 41 శాతం ఉండగా.. తర్వాత చైనా దేశానికి 23 శాతం మేర సరుకు రవాణా అవుతోంది. తర్వాత జపాన్‌ 16, ఈయూకు 10 శాతం ఎగుమతి అవుతోంది. జిల్లా నుంచి ఏటా 1.20 లక్షల నుంచి రూ.1.35 మెట్రిక్‌ టన్నుల వరకూ సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. రూ.3,900 కోట్ల వ్యాపారం సాగుతోంది. నెల రోజులుగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో లక్షల మెట్రిక్‌ టన్నుల సరుకు గోదాములకే పరిమితమైంది. స్థానికంగా గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిల్లాడుతుంటే.. ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులకు ఆశించిన ధర చెల్లించలేని పరిస్థితిలో ఎగుమతిదారులు ఉన్నారు. ఎకరాకు రూ.7 లక్షలకు పైనే పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు.  

మంత్రి కన్నబాబు చొరవతో..  
ఆక్వా రైతుల దీనావస్థను స్వయంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సరుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. సీఎం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణం స్పందించారు. ఆక్వా ప్రొసెసింగ్‌ యూనిట్లు రైతులు పండించిన ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగా మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్‌ కరప మండలంలో ఉన్న రొయ్యల ప్రొసెసింగ్‌ యూనిట్లను సందర్శించారు. యూనిట్లు తెరచి పనులు చేపట్టాలని సూచించారు. కూలీల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆక్వా కేంద్రం వద్ద ఒక నోడల్‌ అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు. పనులు చేసే ప్రాంతంలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని, భౌతిక దూరం పాటించాలని, కారి్మకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)