Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడో, రేపో అల్పపీడనం?
Published on Fri, 09/05/2014 - 01:07
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ రాజస్థాన్, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం గురువారానికి బలహీనపడింది. అయితే అదే సమయంలో వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. అల్పపీడనం ఆరంభంలో ఉత్తర కోస్తాపైన, ఆ తర్వాత తెలంగాణపైన ప్రభావం చూపుతుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ, తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది.
#
Tags