amp pages | Sakshi

కట్నం కోసం చిత్రహింసలు

Published on Tue, 01/21/2014 - 01:35

సాక్షి, కాకినాడ/కాజులూరు, న్యూస్‌లైన్ :ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ తర్వాత కట్నం కోసం వేధించడమే కాక, దాడి చేసి గాయపర్చడంతో ఆరు నెలలుగా కట్టా లక్ష్మి అనే అభాగ్యురాలు ఆస్పత్రి పాలై రోదిస్తోంది. ఆదుకునే ఆసరా లేక ఆమె సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ను కలసి తన గోడు వినిపించింది. ఆరు మాసాల క్రితం కాళ్లు చచ్చుబడిపోయి, వైద్యానికి స్థోమత లేక అగచాట్లు పడుతున్నానని, తన వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను కోరింది. దుర్గాసోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమె వైద్యపరీక్షలకు రూ.10వేలు అందజేయాలని తాను కోరగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు సోముప్రసాద్ అంగీకరించినట్టు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 
 
 కాగా బాధితురాలికి హైదరాబాద్ నిమ్స్‌లో మెరుగైన వైద్యసహాయానికి కలెక్టర్ సిఫారసు చేశారు.ఈ సందర్భంగా బాధితురాలు ‘న్యూస్‌లైన్’కు తెలిపిన వివరాలు.. తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన కట్టా లక్ష్మి కాకినాడలోని ఓ టైలరింగ్ షాపులో పనిచేసేది. కాజులూరు మండలం పాతమంజేరుకి చెందిన కారు డ్రైవర్ మురముళ్ల దాసుతో ఆమెకు పరిచయం ప్రేమగా మారింది. దాసు తల్లితండ్రులు నాగేశ్వరరావు, రాణి అంగీకారంతో 2010 మే 23న వారు పెళ్లి చేసుకున్నారు. ఏడాది తరువాత  కట్నం కావాలంటూ అత్తమామలు, ఆడపడుచు కలసి లక్ష్మిని వేధించడం ప్రారంభించారు. భర్త దాసు కూడా తాగి వచ్చి శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. 
 
 కట్నం తీసుకురాకపోతే తమ కొడుక్కి వేరే పెళ్లి చేస్తామని ఆరు నెలల క్రితం అత్తమామలు బెదిరించారని, అదే సమయంలో భర్త తనపై కర్రతో దాడి చేసి మోకాలిపై విచక్షణారహితంగా కొట్టి గెంటివేశాడంది. దీనిపై గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశానంది. భర్త కొట్టిన దెబ్బలకు కాళ్లు చచ్చుబడిపోవడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. దీనిపై గొల్లపాలెం ఎస్సై పి.క్రాంతికుమార్‌ను వివరణ కోరగా ఆరు నెలల క్రితం కుటుంబ తగాదా విషయమై బాధితురాలు వచ్చిందని, అయితే పెద్దల సమక్షంలో వివాదం సర్దుబాటు చేసుకున్నారని తెలిపారు. మరోమారు ఆమె పోలీస్‌స్టేషన్‌కు వస్తే కాకినాడ మహిళా పోలీసు విభాగంలో ఫిర్యాదు చేయాలని సూచించామన్నారు. గొల్లపాలెం పరిధిలోని కుటుంబ తగాదాలను కాకినాడ మహిళా పోలీసు విభాగమే పరిష్కరిస్తుందన్నారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)