చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యను హత్యచేసి.. భర్త ఆత్మహత్య
Published on Tue, 01/10/2017 - 08:43
వేముల: అనుమానం పెనుభూతమై ఒక కుటుంబాన్ని కాటువేసింది. ఫలితంగా అమాయకుడైన బాలుడు అనాథగా మారాడు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామంలో జరిగింది. నల్లచెరువుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామాంజనేయులు, కవిత దంపతులు కూలీపని చేసుకుని జీవించేవారు. కొంతకాలం నుంచి రామాంజనేయులు భార్యపై అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో కుటుంబంలో కలహాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రామాంజనేయులు తాగుడుకు బానిసయ్యాడు.
ఈ క్రమంలో తెల్లవారుజామున గొడ్డలితో భార్య కవితను నరికి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. ఈ సంఘటన స్థానిక ఎస్సీ కాలనీలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేముల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
#
Tags