amp pages | Sakshi

భోజనం ప్రయాసే...

Published on Thu, 12/20/2018 - 06:49

బడి ఈడు పిల్లలను బడి బాట పట్టించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ప్రయాసగా మారింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే వంటలు చేసే నిర్వాహకుల స్థానే దీని అమలు బాధ్యతను నవ ప్రయాస సంస్థకు అప్పగించారు. దీంతో విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి.

విజయనగరం మున్సిపాలిటీ: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని నవ ప్రయాస సంస్థకు అప్పగించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సమయానికి భోజనం రావడం లేదు. విద్యార్థులకు ఆకలి కేకలు తప్పడం లేదు. ఫలితంగా విద్యార్థులు తరగతులకు సకాలంలో హాజరు కాలేకపోతున్నారు. విజయనగరం పట్టణంలోని పలు మున్సిపల్‌ పాఠశాలలకు మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన భోజనం రెండు గంటల వరకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

ఆదిలోనే హంస పాదు...
మధ్యాహ్న భోజన పథకం అమల్లో నూతన విధానానికి ఆదిలోనే  ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించటంలో   నవ ప్రయాస సంస్థ ప్రతినిధులతో పాటు, విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఈ పథకం ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ లోపాలను సవరించుకోలేకపోతున్నారు. ఆదివారం సాధారణ సెలవుతో పాటు సోమ, మంగళవారాల్లో పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా మూత పడిన పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కాగా.. అదే పరిస్థితులు విద్యార్థులు చవిచూశారు.  సాధారణంగా  మున్సిపల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు 12.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించేవారు. ఈ ప్రక్రియను పాఠశాలల వారీగా నియమించిన నిర్వాహకులే చేపట్టేవారు. వారు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించేవారు. వారం రోజుల నుంచి  ఈ బాధ్యతలను నవ ప్రయాస సంస్థకు అప్పగించినప్పటి నుంచి విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం నిర్ణీత సమయానికి రావాల్సిన భోజనం  2.10 గంటలకు  పాఠశాలలకు రావటంతో విద్యార్థులు ఖాళీ కంచాలు పట్టుకుని ఆకలితో అవస్థలు పడ్డారు. మధ్యాహ్న భోజనం ఎప్పుడు వస్తుందా! అంటూ ఎదురు చూశారు. చివరికి 2.10 గంటలకు భోజనం పాఠశాలలకు చేరుకోగా... కేవలం ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాత్రమే  తరగతులు మానుకుని భోజనం చేయగా.. ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. ఇలా మున్సిపల్‌ కస్పా ఉన్నత పాఠశాలకు చెందిన 1200 మంది విద్యార్థులతో పాటు రాధాస్వామి మున్సిపల్‌ పాఠశాల, కస్పా కాలేజ్, మున్సిపల్‌ ఉర్ధూ స్కూల్, అరిచెట్ల స్కూల్‌కు చెందిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు.

సక్రమంగా సాగని చదువులు
 చదువులు సైతం సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయానికి పలు పాఠ«శాలలకు భోజనం చేరకపోగా... తిరిగి తరగతులు పునఃప్రారంభ సమయానికి చేరుకోవటంతో విద్యార్థులు తరగతులు మానుకుని భోజనం చేయాల్సి వచ్చింది. దీంతో చదువులు సక్రమంగా సాగటం లేదని, మరి కొద్ది రోజుల్లో జరగనున్న పది పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పరిస్థితి  ఆందోళనకరంగా మారిందని  విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.

‘నవ’ నిర్లక్ష్యం...
మధ్యాహ్న భోజన పథకం అమల్లో  నవ ప్రయాస సంస్థకు చెందిన ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అపవాదను ఆదిలోనే మూటగట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ సంస్థ విద్యాశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు  నెల్లిమర్ల  మండల కేంద్రం నుంచి  విజయనగరం పట్టణంలోని విద్యార్థులకు   మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనున్నారు. ఇందుకు నవ ప్రయాస అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ కేవలం విజయనగరమే కాకుండా  నెల్లిమర్ల, డెంకాడ మండలాల పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనుంది. నెల్లిమర్ల మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి వాహనాల ద్వారా  ఆహారాన్ని  పాఠశాలల వారీగా సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా   నూతన వి«ధానం అమల్లో నవ ప్రయాస సంస్థ ప్రతినిధులు మొదటి రోజే తడబాటుకు గురయ్యారు.  పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల నుంచి భోజనాన్ని తరలించే సమయంలో ఎటువంటి ఆటంకాలు  తలెత్తినా  ఆ రోజు విద్యార్థులు పస్తులు తప్పవన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇదే విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ టి.వేణుగోపాల్‌ వద్ద సాక్షి ప్రస్తావించగా... పలు పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం అందించటంలో బుధవారం జాప్యం జరిగిందన్నారు. ఇదే విషయమై  జిల్లా విద్యాశాఖ అధికారితో చర్చించటం జరిగిందన్నారు. సమస్య పునరావృతం కాకుండా అవసరమై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)