amp pages | Sakshi

'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం'

Published on Tue, 03/03/2020 - 18:08

సాక్షి, అమరావతి: ప్రజాలెవరూ కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. వైరస్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో కరోనా జాడలు బయటపడిన నేపథ్యంలో ఆళ్లనాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుక్షణం అప్రమత్తంగా ఉందని, పోర్టుల్లోనూ.. ఎయిర్‌ పోర్టుల్లోనూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా 8 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని.. తాజాగా కేంద్రం సూచనల మేరకు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. ఎక్కడికక్కడ మాస్కులు..వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనాపై కొన్ని నిరాధారమైన వార్తలు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.  చదవండి: క‌రోనాతో మరో వైద్యుడు మృతి

ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై కేంద్రం ఈ నెల 6న వర్క్‌షాప్ నిర్వహిస్తోందని.. దీని ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచడంతో పాటు ఏఎన్ఎంల ద్వారా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ప్రజలకు అవగాహన వచ్చేలా కరపత్రాలు ప్రింట్‌ చేయమని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఏఎన్‌ఎంల ద్వారా గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ పట్ల ముందస్తు జాగ్రత్తలు గురించి వివరిస్తారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కరోనా వైరస్‌ రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదవండి: కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్‌

ఏపీలో కరోనా కేసు ఇప్పటిదాకా నమోదు కాలేదన్నారు. కరోనా కేసు నమోదైనా పూర్తిస్థాయిలో వారికి వైద్య సేవలు అందించేందుకు, వ్యాధి అదుపు చేయడానికి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షిస్తున్నామని.. ఇప్పటికే 250మందికి పైగా విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మరో 11 మందికి రక్త పరీక్షలు కూడా జరిపామని.. ఎవ్వరికీ కరోనా లేదని తేలిందన్నారు. రాష్ట్రంలోని కొందరు నిపుణులు కేంద్ర ప్రభుత్వం వద్ద శిక్షణ తీసుకొని వచ్చిన తరువాత 9వ తేదీన రాష్ట్ర స్థాయిలో ట్రైనింగ్‌ క్యాంపు నిర్వహించబోతున్నామన్నారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి ఎంటర్‌ అయితే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఏ విధంగా ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని కేంద్రంలో ట్రైనింగ్‌ తీసుకున్న రాష్ట్రస్థాయి నిపుణులు జిల్లాలో ఉన్న డాక్టర్లు, సిబ్బందికి తర్ఫీదు ఇస్తారన్నారు. ఈ విధంగా కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ఒక వేళ వస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని కూడా ముందుకువెళ్తున్నామన్నారు. 

Videos

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)