amp pages | Sakshi

దారి తప్పి లోకేష్ ఏలూరుకు: అబ్బయ్య చౌదరి

Published on Thu, 10/31/2019 - 18:29

సాక్షి, పశ్చిమ గోదావరి: పాదయాత్రలో పామాయిల్ రైతులు తమ సమస్యలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం జగన్‌ వ్యవసాయశాఖ మంత్రిని పంపించి.. దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. గురువారం అబ్బయ్య చౌదరిని దెందులూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ రైతులే ఫ్యాక్టరీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఐదు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని వ్యాఖ్యానించారు. నిరక్షరాస్యతలో ఆంద్రప్రదేశ్ చివరి స్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని చేపట్టామని అబ్బయ్య తెలిపారు.

దారి తప్పి టీడీపీ నేత లోకేష్ ఏలూరు వచ్చి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని మండ్డిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేనిపై కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. అప్పుడు అధికారంలో ఉండటంతో చింతమనేనిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అమరావతి అవకతవకలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 35 వేల కోట్ల రుపాయలను ఎన్నికల ముందు లూటీ చేశారని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు ఇక్కడి ఆస్తులను కట్టబెట్టాలనుకున్నారని మండిపడ్డారు. చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో అనేక దాడులకు పాల్పడినప్పుడు లోకేష్ ఎందుకు మాట్లాడలేదపని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు.  ఐదు నెలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదంటూ లోకేష్‌ చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థతిలో లేరని అబ్బయ్య చౌదరి అన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)