Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
Published on Sun, 04/19/2015 - 14:17
నిడదవోలు(పశ్చిమగోదావరి): దంపతుల మధ్య విభేదాలు ఆ పేద కుటుంబంలో చిచ్చురేపాయి. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి, ఆ తరువాత ఆమె కూడా తీసుకుంది. ఈ ఘటనలో ఒక కూతురు ప్రాణం కోల్పోగా, మరో చిన్నారి, తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం పోరుమామిడి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. వివరాలివీ... గ్రామానికి చెందిన రామకృష్ణ, గౌరమ్మ దంపతులు నిరుపేద వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమార్తెలు సోనీ(8), రాధిక(6) ఉన్నారు. దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం ఉదయం భర్త పనిమీద బయటకు వెళ్లగా ఇద్దరు కూతుళ్లకు విష గుళికలు కలిపిన అన్నం తినిపించిన గౌరమ్మ తనూ తింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన రామకృష్ణ విషయం గ్రహించి ముగ్గురినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.అయితే సోనీ చనిపోగా రాధిక, గౌరమ్మ చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags