amp pages | Sakshi

శిరీష కేసులో కొత్త కోణం

Published on Fri, 10/06/2017 - 14:30

పట్నంబజారు(గుంటూరు): విద్యార్థులను ఇటలీకి పంపిన వీసాల కేసులో గత 18న ఆత్మహత్యకు పాల్పడిన ఇంటూరి శిరీష (29) కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. సుమారు రెండు వందల మంది విద్యార్థులకు సంబంధించిన వీసాల విషయంలో ముంబైలోని కన్సల్‌టెన్సీ నకిలీదని పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజుల క్రితం గుంటూరు పాతగుంటూరుకు చెందిన పోలీసులు ముంబై వెళ్లారు.

అయితే ముంబైలోని మెహాతారోడ్‌ కృష్ణకుంజ్‌ ప్రాంతంలో ఉన్న గగన్‌దీప్‌ కార్యాలయానికి వెళ్లిన గుంటూరు పోలీసులు సైతం కంగుతున్నారు. పూర్తిస్థాయిలో గుంటూరుకు పంపని వీసాలకు తమకు ఎటువంటి సంబంధంలేదని గగన్‌దీప్‌ కన్సల్‌టెన్సీ నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. కనీసం పోలీసులకు విజిటింగ్‌ కార్డు కూడా ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది.

ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవటంతో పోలీసులు వెనుదిరిగి వచ్చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో విచారణపై మరింత దృష్టి సారించిన పోలీసులు ముంబై నుంచి గుంటూరుకు వచ్చిన కొరియర్‌ ఆధారంగా అక్కడి కొరియర్‌ కార్యాలయాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి సమాచారం కొరవడటంతో సదరు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటలీలో ఉన్న తలశిల కిషోర్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ బృందంతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

మరి వీసాలు ఎలా వచ్చాయి?
ముంబైలో గగన్‌దీప్‌ కన్సలెటెన్సీ, కొరియర్‌ కార్యాలయ నిర్వాహకుల నుంచి కొద్దిపాటి సమాచారం ఆధారంగా కొరియర్‌ ద్వారా కూడా వీసాలు వచ్చేందుకు అవకాశంలేదని, శిరీషను మోసం చేసిన వ్యక్తులే కొరియర్‌లా నకిలీ వీసాలను పంపి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా నకిలీ వీసాలు తయారు చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు వర్గాలు చర్యలు చేపడుతున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)