వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆదిత్యుని పాదాలను ‘తాకని’ సూర్యకిరణాలు
Published on Thu, 03/09/2017 - 10:01
అరసవల్లి (శ్రీకాకుళం జిల్లా): అరసవల్లి సూర్యదేవాలయంలో గురువారం ఉదయం సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకలేదు. ప్రతి యేటా మార్చి 8,9,10 తేదీలలో సూర్యోదయంలో కనిపించే సూర్యకిరణ దర్శనం బుధ,గురువారాల్లో మేఘాల కారణంగా సాధ్యపడలేదు.
సూర్య కిరణాలు ఆదిత్యుడి పాదాలను తాకే తరుణాన్ని వీక్షిద్దామని వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులంతా నిరాశతో వెనుదిరిగారు.ఈ ఆలయం లో సూర్యని కిరణాలు నేరుగా సూర్యదేవుని అరుణశిల విగ్రహం పై పడి దేవదేవుడు బంగారు వర్ణంలో మెరిసిపోతాడు. ప్రతి ఏటా మార్చి నెలలో మూడు రోజులు, అక్టోబరు నెలలో మూడు రోజులు ఇలా కిరణాలు దేవుని విగ్రహాన్ని తాకుతాయి. ఈ సమయంలో దేవుని దర్శనం చేసుకుంటే ఆరోగ్యప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. రేపు కిరణాలు పడే అవకాశం ఉండటంతో ఇతరప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆదిత్యుని దర్శనం కోసం నిరీక్షించనున్నారు.
#
Tags