amp pages | Sakshi

ఇదేనా భరోసా..!

Published on Sat, 11/08/2014 - 14:30

తాళ్లూరు:ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నారు.. పింఛన్ల పునః పరిశీలనలోనూ అర్హులుగా తేలారు. జన్మభూమి సభల్లో ఎన్టీఆర్ భరోసా పత్రాలూ అందుకున్నారు. ఆ నెల పింఛన్ కూడా తీసుకున్నారు. కానీ మరుసటి నెలకే జాబితాలో పేరు లేదు. అదేమిటంటే ఆధార్ నంబరు సరిగా నమోదు కాలేదని కొందరివి..వేలిముద్రలు సరిపోలేదని మరికొందరివి నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. ఏ ఆధారం లేని తమకు ఉన్న పింఛనూ తీసేశారు..ఇదెక్కడి అన్యాయమంటూ పింఛన్‌దారులు లబోదిబోమంటున్నారు. సర్కారు ఇస్తామన్న భరోసా ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
 
 తాళ్లూరుకు చెందిన లోకిరెడ్డి సుబ్బారెడ్డి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాడు. ప్రైవేటుగా డిగ్రీ చేస్తున్నాడు. వికలాంగుడు కావడంతో రెండేళ్ల నుంచి పింఛన్ వస్తోంది. ఇటీవల సామాజిక పింఛన్ల తనిఖీలో అర్హుడిగా తేల్చారు. దీంతో బట్వాడా కోసం పోస్టుమాస్టర్ వద్దకు వెళ్లాడు. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిపోవడం లేదు..ఆధార్ నంబరు తప్పుగా నమోదైందని..దీంతో మీకు పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. గత నెల రోజులుగా ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగి ఆధార్ నంబరు నమోదు చేసుకున్నాడు. అయినా రెండో నెలలో పింఛన్ రాలేదు. దీంతో ఏం చెయ్యాలో ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి.
 
 వీరే కాదు..ఇదే సమస్యలతో వందల మంది పింఛన్‌దారులు అర్హులై ఉండీ..పింఛన్ అందక నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ సక్రమంగా నమోదు కాక, బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సరిపోక నియోజకవర్గంలో దాదాపు 1310 మంది పింఛన్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరిలో అనేక మంది వృద్ధులు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కొనేందుకు పూర్తిగా పింఛన్ నగదుపైనే ఆధారపడుతున్నారు.
 
  దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20,025 మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో పింఛన్ల పునః పరిశీలనలో 3,726 పింఛన్లు రద్దయ్యాయి. ఆధార్ కార్డుల్లేక, వేలిముద్రలు సరిపోక మరో 1310 పింఛన్లు ఆగాయి. గతంలో బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలిముద్రలు నమోదు కాకపోతే..వారి బంధువులవి ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. మళ్లీ నూతన పద్ధతి అంటూ ఈనెల పింఛన్లు ఆపేశారు.  పింఛన్లపై ప్రభుత్వం రోజుకో విధానం అవలంబిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో తమకు జరిగిన అన్యాయంపై అడిగేందుకు సిద్ధమవుతున్న పింఛన్‌దారులను పోలీసులు అడ్డుకుంటున్నారని... ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.   
 
 పింఛన్ పత్రాలు ఇవ్వడం ఎందుకు ?: కోటమ్మ
 
 ఐదేళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నా. ఊళ్లో పంచాయతీ దగ్గర సభ పెట్టిన పింఛన్ భరోసా పత్రాలిచ్చారు. ఆ నెల పింఛన్ తీసుకున్నా. మాకు భూములున్నాయని ఎవరో చెప్పి పింఛన్ ఆపించేశారంట. మరి భరోసా పత్రాలివ్వడం ఎందుకు? మళ్లీ పింఛన్ తొలగించడం ఎందుకు? ఇటువంటి పత్రాలున్నా..పోయినా ఒక్కటే. మా లాంటి వారిని ఇబ్బంది పెడితే పుట్టగతులుండవు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)