amp pages | Sakshi

‘ఒంగోలు’ ఇడుపులపాయకెళ్లింది!

Published on Wed, 07/11/2018 - 11:32

సాక్షి, కడప :  పాలకుల నిర్లక్ష్యం...ప్రభుత్వ అలసత్వం..వెరసి విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అత్యున్నత సాంకేతిక విద్య అందించేందుకు ట్రిపుల్‌ ఐటీని మంజూరు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ వసతులు కల్పించడంలో లేదు. 2016లో టీడీపీ సర్కార్‌ కొత్తగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుకు పూనుకుంది. అనుకున్నదే తడువుగా తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. అయితే సమస్యలు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు అడుగులు పడకపోవడం గమనార్హం. ఇడుపులపాయలోనే రెండేళ్లు విద్యా సంవత్సరం దాటి మూడో ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తున్నా ఇప్పటికీ ఒంగోలులో ప్రత్యేక బోధనకు బీజం పడలేదు.

ప్రస్తుతం వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలోనే రెండు ట్రిపుల్‌ ఐటీల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సొంత భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా.. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ వారు పాత క్యాంపస్‌ (రేకుల షెడ్లు)లో ఉంటున్నారు. అక్కడ విద్యాబోధనతోపాటు హాస్టల్‌ వసతులు కల్పించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.ఈ నేపథ్యంలో 2008లో తాత్కాలిక షెడ్లు వేసి ప్రారంభించారు. ప్రస్తుతం రెండేళ్ల ఇంటర్‌ విద్యను పూర్తి చేసుకుని ఇంజినీరింగ్‌లోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు భవనాల్లో చదువు ఏర్పాట్లకు ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ విద్యార్థులను భవనాల్లో సర్దుబాటు చేయడం ద్వారా పాత క్యాంపస్‌లో రెండు వేల మందిని యథావిధిగా కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు.

కొలిక్కి రాని ఒంగోలు వ్యవహారం
ప్రస్తుతం ఎన్నికల హడావుడి ప్రారంభమవుతోంది.డిసెంబరులోనే ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయలేదు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భూముల అన్వేషణ ప్రారంభించింది. కనిగిరి నియోజకవర్గంలో దాదాపు 200కు పైగా ఎకరాల స్థలం సిద్ధంగా ఉన్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి.  ఈ విషయం మంత్రివర్గంలో చర్చించి జీఓ విడుదల చేయాల్సి ఉంది.  ఇదంతా ఎప్పుడు కొలిక్కి వస్తుంది.. ఎప్పుడు ఆమోదముద్ర పడుతుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకోవాలంటేనే చాలా సమయం పడుతుంది. పైగా ఈ ఏడాది ఎన్నికల ఏడాదిగా భావిస్తున్న తరుణంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం గగనమే. స్థల సేకరణకే దాదాపు రెండేళ్లుగా సమయం పడితే.. ఇక భవనాల నిర్మాణానికి ఎన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందోనని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. 

ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో 3 వేలమంది
జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మూడు వేల సంఖ్యను దాటుతున్నారు. మొదటి సంవత్సరం వెయ్యి మందితోపాటు అదనంగా మరో 150 మంది..రెండో ఏడాది  మరో వెయ్యి కలుపుకుని 2150 మందికి పైగా ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో కూడా వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ నేప«థ్యంలో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మూడు వేల మంది మార్కును దాటుతున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు  ఇబ్బందులు తప్పడంలేదు. మొదటి, రెండు సంవత్సరాల వారికి మొదట్లో చాలా రోజులు ల్యాప్‌టాప్‌ల సమస్య వేధించింది. దీంతో స్క్రీన్‌ మీదనే పాఠాలు బోధిస్తూ ల్యాప్‌ట్యాప్‌లు లేకుండా విద్యా సంవత్సరాన్ని కొనసాగించారు. రేకుల షెడ్లలో సమస్యలు వెంటాడుతున్నాయి. తాత్కాలికం మాటున వారు  అవస్థలు పడుతున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో పాత క్యాంపస్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోస్తాంధ్ర జిల్లాల్లోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు నూజివీడు, ఒంగోలు క్యాంపస్‌లు అనువుగా ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వారికి శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంత విద్యార్థులకు ఇడుపులపాయ సౌకర్యంగా ఉంటుంది. అయితే శ్రీకాకుళం, ఇడుపులపాయ మినహాయిస్తే ఒంగోలు విద్యార్థులకు అటు, ఇటు వెళ్లిరావాలన్నా కూడా కష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూర ప్రయాణాలు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోంది.

సమస్యల్లేవు...భవనాల్లోకి మారుతున్నాం,ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌ నరసింహరాజు
ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో విద్యను అభ్యసించే మూడో సంవత్సరం విద్యార్థులకు భవనాల్లో వసతి కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌ నరసింహారాజు తెలిపారు. సమస్యల విషయమై ‘సాక్షి’ ప్రతినిధి డైరెక్టర్‌ను వివరణ కోరగా పై విధంగా స్పందించారు. భవనాలకు సంబంధించి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో ఎలాంటి సమస్యలు లేవు. తాత్కాలిక క్యాంపస్‌లోనే ఒకటి, రెండు సంవత్సరాల విద్యార్థులకు వసతి ఉంటుందన్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి కనిగిరి వద్ద స్థల సేకరణ పూర్తయిందని, జీఓ రావడమే తరువాయి అని తెలిపారు. ప్రస్తుతానికి అడ్మిషన్లు ఇడుపులపాయలోనే చేసుకుంటున్నామని తెలిపారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)