amp pages | Sakshi

ఆపరేషన్‌ ఆర్కే వెంటనే నిలిపేయాలి

Published on Wed, 09/25/2019 - 09:49

సాక్షి, డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణం): ఏవోబీలో ఆపరేషన్‌ ఆర్కే వెంటనే నిలిపివేసి, ఆ పేరిట ఆదివాసులపై జరుగుతున్న హింసను ఆపేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. పోలీసుల అదుపులో ఉన్న అరుణను కోర్టులో హాజరుపరచాలని కోరాయి. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, సంఘం ప్రతినిధి శిరీష(ఆర్కే భార్య), పౌర హక్కుల సంఘం నేత టి.శ్రీరామ్మూర్తి, ప్రగతి శీలా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి, సీఆర్‌పీపీ పద్మ, అరుణ తండ్రి లక్ష్మణరావు మాట్లాడారు.

ఈ నెల 22 మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని, అందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని వార్త వచ్చిందని, ఆ తర్వాత ఐదుగురు కాదు ముగ్గురని పోలీసులు ప్రకటించారన్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత అరుణ ఉన్నారని ప్రకటించారని, మళ్లీ ఆమె ఉందో లేదో చెప్పకుండా ఉంచారని పేర్కొన్నారు. ఏవోబీలో కూంబింగ్‌ చేసినప్పుడల్లా సాధారణ ఆదివాసులను మావోయిస్టుల పేరిట చంపి ఎన్‌కౌంటర్‌ ప్రకటించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. అరుణ గనుక పోలీసుల అదుపులో ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని కోరారు.

ఈ నెల 13న ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ కటాప్‌ ఏరియాలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సంతకు వెళ్లిన అర్జున్‌ కిలో అనే ఆదివాసి యువకుడిని విచారణ పేరిట తీసుకెళ్లి 3 రోజులకు చంపేశారని దుయ్యబట్టారు. మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన హిందుత్వ విధానాలు, కార్పొరేట్‌ ప్రయోజనాలను కాపాడే క్రమంలో తనకు అడ్డువస్తున్న అన్ని ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులను అణచివేస్తున్నారని ఆరోపించారు.  మొదట మిషన్‌ 2016–17 వ్యూహాలు విఫలమయ్యాక, భారత ప్రభుత్వం సమధాన్‌ 2022ను తెరపైకి తెచ్చిందన్నారు. అవసరమైతే విప్లవోద్యమ ప్రాంతాలపై వైమానిక దాడులు చేస్తామని కూడా ప్రకటించారన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దులోనే ఉన్నాడని, ఆర్కేను ఎలాగైనా పట్టుకోవాలని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ చెప్పారన్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)