amp pages | Sakshi

రూ.30 వేల కోట్లు ఇవ్వండి

Published on Tue, 08/27/2019 - 04:59

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఇంటింటికీ నల్లా నీరు’ పథకానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, దీనిలో రూ. 30 వేల కోట్ల మేర సాయం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రాన్ని కోరారు. ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ అమలుపై కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్ని రాష్ట్రాలతో కేంద్ర మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. ఆగస్టు 15న ప్రధాని ఈ మిషన్‌కు సంబంధించి చేసిన ప్రకటనకు ముందే ఏపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రోజుకు 100 లీటర్ల చొప్పున నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు రూపొందించింది. గ్రామాలు, పట్టణాల్లోనూ నీరు సరఫరా చేస్తాం. ఈ ప్రాజెక్టుకు వచ్చే నెలలో టెండర్లు కూడా పిలవబోతున్నాం. మొదటి విడతలో కొన్ని జిల్లాలకు, రెండో విడతలో మిగిలిన జిల్లాలకు ఇచ్చే విధంగా ఈ పథకం రూపొందిస్తున్నాం. జల్‌ జీవన్‌ మిషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరగా మా పథకాన్ని అమలుచేయాలన్న సంకల్పంతో పనిచేస్తాం’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో పోలవరం సందర్శనకు షెకావత్‌
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తాజా స్థితిగతులపై కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేంద్రం సహకరిస్తుందని భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘పోలవరం అంశం నా పరిధిలో లేదు. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు పోలవరం రావాలని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఆహ్వానించాను. సెప్టెంబర్‌లో వస్తామన్నారు. కేంద్రం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మేం టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియ పూర్తయి రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుంది’ అని తెలిపారు.

ఈ ఏడాదికి రూ. 300 కోట్లు మంజూరు
జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం అమలుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ. 300 కోట్లు నిధులను మంజూరు చేసినట్టు అధికారులు చెప్పారు. మంచి నీటి పథకాల నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం నిధులు కేంద్రం విడుదల చేస్తే, మిగిలిన 50 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు కలిపి మొత్తం రూ. 600 కోట్లు ఈ పథకంలో ఖర్చు పెడితే, అందులో రూ. 120 కోట్ల మేర ఇళ్లకు మంచి నీటి కొళాయిల ఏర్పాటుకే ఖర్చు పెట్టాల్సి ఉంది. 

జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రారంభం..
జాతీయ గ్రామీణ మంచి నీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసి కొత్తగా ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచి నీటి వసతి కల్పించడమే జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేసే నిధుల్లో 20 శాతం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు మంచినీటి కొళాయిల ఏర్పాటుకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అనంతరం వాటి నిర్వహణ వ్యయాలను సంబంధిత గ్రామ పంచాయతీనే భరించాల్సి ఉంటుంది. అవసరమైతే కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకునే వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)