amp pages | Sakshi

అనుకున్నట్టే అయింది

Published on Fri, 05/03/2019 - 12:50

రాయవరం (మండపేట): ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీని ఏప్రిల్‌ ఒకటో తేదీనే ఆగమేఘాలమీద టీడీ పీ సర్కారు అందజేసి మే నెలలో మాత్రం మౌనం దా ల్చింది. ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు పూర్తవడంతో మే నెలతో మాకేమి సంబంధం అన్నట్టుగా వ్యవహరించడంతో లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు. బ్యాంకుల నుంచి పింఛన్ల సొమ్ము పంచాయతీ కార్యదర్శులకు 30వ తేదీ నాటికి అందకపోవడంతో పింఛన్లు ఒక టో తేదీన ఇవ్వలేకపోయారు. ఒకటో తేదీన ‘మే’డే సెలవు దినం కావడంతో రెండో తేదీన బ్యాంకుల నుం చి డ్రా చేసి పంపిణీ చేస్తారేమోనని ఎదురు చూశారు. కానీ గురువారం కూడా ఆ జాడకానరాకపోవడంతో మూడో తేదీనైనా ఇస్తారేమోనని ఆశలు పెట్టుకున్నారు. పింఛన్ల సొమ్ము వేరే ఖాతాలకు ఎన్నికల ముందు టీడీపీ సర్కారు బదిలీ చేయడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

5.83 లక్షల మందికి పింఛన్లు...
జిల్లాలో 5, 83, 925 మంది వృద్ధులు, వితంతువులు, చేనేతలు, కల్లుగీత కార్మికులకు ప్రతి నెలా పింఛన్లు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వీరందరికీ రూ.123.73 కోట్లు అందజేస్తున్నారు. పింఛన్ల సొమ్మును ఒకటో తేదీన అందజేయాల్సి ఉంది. ఆయా మండలాల ఎంపీడీవో బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. ఆ సొమ్మును పంచాయతీ కార్యదర్శులు డ్రా చేసుకుని లబ్ధిదారులకు అందజేస్తారు. ఇదీ పద్ధతి...ఏప్రిల్‌ నెల వరకు అలానే జరిగేది. ఎన్నికల అనంతరం ఈ సిస్టంకు బ్రేకుపడింది.

ఉదయం 6 గంటల నుంచే...
వేసవిని దృష్టిలో ఉంచుకుని పింఛన్లను ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పంపిణీ చేయాలని డీఆర్‌డీఏ అధికారులు మండలాలకు, మండలాల నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీరు, మజ్జిగను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇంటికి వెళ్లి అందజేయాలని కూడా సూచించారు.

శృంగవరంలో..
రౌతులపూడి (పత్తిపాడు): రౌతులపూడి మండలంలోని శృంగవరంలో పింఛన్ల పంపిణీ జరగలేదు. దీంతో ఉదయం నుంచీ పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాసిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిరాశగా వెనుతిరిగారు. పింఛన్ల సొమ్ములు ఇంకా అందలేదని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని పంపిణీ అధికారి, వీఆర్‌ఓ రామకృష్ణ తెలిపారని గ్రామానికి చెందిన కనకదుర్గ వికలాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌ ఉప్పలపాటి నాగేశ్వరరావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు.

రాజవొమ్మంగిలో,,,
రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్ల పంపిణీ రెండో తేదీ గురువారం కూడా ప్రారంభం కాలేదు. మండలంలో మొత్తం 5,711 మంది పింఛదారులున్నారు. వారికి చెల్లించడానికి రూ.1,22,37,500 అవసరం. వీటిలో వృద్ధులు 2,979 మంది, వితంతువులు 2,202 మంది, వికలాంగులు 414 మంది, ఏబీహెచ్‌ (అభయ హస్తం) 103 మంది, చేనేత ఒకటి, ఒంటరి మహిళ పింఛనుదారులు 12 మంది ఉన్నారు. అడ్డతీగల మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకుంది.

బ్యాంకు నుంచి సొమ్ముఅందనందునే...
ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బు జమ చేసినట్లు సమాచారం ఉంది. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము అందక పోవడంతో ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం.– కేఆర్‌ఎస్‌ కృష్ణప్రసాద్, ఎంపీడీవో, రాయవరం

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)