లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘కొండ’నాగులు
Published on Mon, 04/09/2018 - 07:02
సాక్షి, తిరుమల : తిరుమల కొండపై ఆదివారం రెండు నాగుపాములు జనాన్ని హడలెత్తించా యి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆకాశగంగ సమీపంలో ఓ టీ దుకాణంలోకి నాగుపాము వెళ్లింది. ఈ సమాచారంతో స్థానికుడు మునస్వామి ఆ పామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇక స్థానికులు నివాసం ఉండే తిరుమల బాలాజీనగర్ ఈస్ట్లో 1012 నంబరు ఇంటికి సమీపంలో మరో నాగుపాము వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు దాన్ని చూసి పరుగులు తీశారు. ఈ సమాచారంతో మునస్వామి వెళ్లి ఆ పామును కూడా చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆయన పాము కాటుకు గురయ్యాడు. కుడిచేతికి కాటు పడడంతో రక్తం వచ్చింది. ఆ పామును అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు.
#
Tags