amp pages | Sakshi

దద్దరిల్లిన కలెక్టరేట్‌...

Published on Sat, 06/30/2018 - 10:31

విజయనగరం పూల్‌బాగ్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేటీకరణ చేయవద్దని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఎండీఎం యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి. సుధారాణి మాట్లాడుతూ,  మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేస్తే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.

పథకాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనుకోవడం తగదన్నారు. బిల్లులు ఇవ్వకపోయినా 15 ఏళ్లుగా అనేక కష్టానష్టాలకోర్చి పథకాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే పథకాన్ని ప్రవేటీకరించే ఆలోచనను విరమించుకోవడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు కనీసవేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే మెనూ చార్జీలు పెంచడం.. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, తదతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.

 రెచ్చిపోయిన పోలీసులు

మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పది నుంచి 12 గంటల వరకు కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. అయినప్పటికీ అధికారులు రాకపోయేసరికి రాస్తారోకో చేపట్టేందుకు సిద్ధపడ్డారు. అప్పటికే ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఒక్కసారికి వారిపై విరుచుకుపడ్డారు. అధికారులు వస్తే సమస్యలు చెప్పుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నా పోలీసులు వినకుండా మహిళలు, నాయకులను ఈడ్చుకుంటూ డెంకాడ, గంట్యాడ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, నాయకులు ఎన్‌వై నాయుడు, ఎ. జగన్మోహన్‌రావు,సీహెచ్‌ జగన్, బి.సూర్యనారాయణ, పి. అప్పారావు, ఎం. రమణ, తదితర 69 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రభుత్వం తీరు సరికాదు
డెంకాడ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు అన్నారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న నాయకులు, నిర్వాహకులను పోలీసులు డెంకాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, టీవై నాయుడు, కార్యదర్శి ఎ.జగన్మోహన్, బి.సుధారాణి, మధ్యాహ్న భోజన పథకం సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు తులసి, వరలక్ష్మి, శాంతకుమారి తదితరులు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు, సంస్థలకు అప్పజెప్పరాదన్నారు.

వర్కర్లు, హెల్పర్లకు నెలకు ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ప్రతినెలా ఐదో తేదో లోగా బిల్లులు, వేతనాలు చెల్లించాలన్నారు. ఒక్కో విద్యార్థికి మెనూ చార్జీ పది రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యమాన్ని ఆపలేదన్నారు.  


 

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)