సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బినామీ పేర్లతో సొమ్ములు స్వాహా
Published on Thu, 06/07/2018 - 06:49
పశ్చిమగోదావరి : ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను పేదలకు అందించాల్సిన టీడీపీ నాయకులు బినామీ పేర్లతో పథకాలను మంజూరు చేయించుకుని సొమ్ములు కాజేశారంటూ పెదవేగి మండలం రాయనపాలెం గ్రామానికి చెందిన సమిల్ సురేష్ అనే వ్యక్తి ఆరోపించారు. పాలంగిలో జగన్మోహన్రెడ్డిని కలుసుకుని వివరాలు అందించారు. సమాచార హక్కు చట్టంలో వాకబు చేసి వివరాలు సేకరించినట్టు చెప్పారు.
కిడ్నీ సమస్యతోబాధపడుతున్నా..
తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని ఉండ్రాజవరంలో అత్తిశెట్టి లక్ష్మణరావు అనే వ్యక్తి అదే గ్రామంలో జగన్మోహన్రెడ్డిని కలుసుకుని తన బాధ చెప్పుకున్నారు. భార్య, పిల్లలను పోషించడం కష్టతరంగా మారిందని, తనకు ఆర్థికంగా తోడ్పాటునివ్వాలని వేడుకున్నారు.
ఏఎన్ఎంలుగా ఉద్యోగాలు ఇవ్వాలి
ఎంతో మంది ఏఎన్ఎంలుగా శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు లేక ఆశ వర్కర్లుగా పనిచేస్తున్నారని, అటువంటి వారిని ఏఎన్ఎంలుగా నియమించేందుకు కృషి చేయాలంటూ పినిశెట్టి మంగతాయారు అనే మహిళ కోరారు. ఉండ్రాజవరంలో జగన్మోహన్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. 13 ఏళ్లుగా ఆశా వర్కర్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నామని చెప్పారు.
Tags