amp pages | Sakshi

నీళ్లే లేవు-విమానమేల?

Published on Mon, 02/02/2015 - 05:44

* బీళ్లుగా మారిన పంట పొలాలు
* కుప్పంలో పనుల్లేక వలసపోతున్న జనం
* ఎయిర్‌పోర్ట్ ఏర్పాట్లలో అధికారులు బిజీ
* సర్వేల కోసం నిధులు ఖర్చుపెడుతున్న వైనం
కుప్పం: సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. సమస్య పరిష్కరించి వారికి అండగా నిలవాల్సిన సీఎం చంద్రబాబునాయుడు, అధికార యంత్రాంగం విమానాశ్రయ ఏర్పాటు పనుల్లో నిమగ్నం కావడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే వర్షాలు లేక పనులు దొరక్క వేలాది కుటుంబాలు వలసబాట పట్టాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గుక్కెడు నీళ్లిచ్చి, పనులు కల్పించి బతుకుదారి చూపుతారనే ఆశతో కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం కనిపించడం లేదు.
 
సర్వేల కోసం నిధుల మంజూరు

కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ స్థలం సర్వే చేసేందుకు రూ.14 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రామకుప్పం మండలం అమ్మేరుపేట, కీలకపాడు గ్రామాలకు సంబంధించిన స్థలాలను ఎంపిక చేశారు.
 
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అధికారుల రికార్డుల మేరకు 210 గ్రావూల్లో నీటిసవుస్య తీవ్రంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నాలుగేళ్లుగా వర్షాలు పడకపోవడంతో కుప్పం కరువు కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గంలోని 570 చెరువులు పూర్తిగా ఎండిపోయూయి. కుప్పంలో 2.55 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 21 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు లేక 80 శాతం భూములు బీళ్లుగా మారాయి. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో నీళ్లు కావాలంటే 1250-1500 అడుగుల లోతు వరకు బోరు వేయాల్సిందే. కూలి పనుల కోసం నిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు 18 వేల వుంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి కరువు పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో వివూనాశ్రయూలు నిర్మించే పనిలో పడింది.
 
రెండు గ్రామాలు ఖాళీ
విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన స్థలం వల్ల రెండు గ్రావూల ప్రజల జీవితాలు కష్టాల్లో పడనున్నాయి. 30 ఏళ్ల క్రితం బడుగు, బలహీన వర్గాల కోసం అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుతో భూములను స్వాధీనం చేసుకోనుంది.
 
విమానాశ్రయం అవసరమా?
కుప్పం ప్రాంతంలో పండుతున్న పంటలను ఎగుమతి చేసేందుకు డెమో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం కుప్పం లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులంతా వ్యవసాయుం వదలి పనుల కోసం పట్టణాలకు తరలి వెళుతున్నారు. వ్యవసాయు బోర్లు ఎండిపోయాయి.  నీటి సౌకర్యంపై దృష్టి పెట్టకుండా విమానాశ్రయం అవసరమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)