amp pages | Sakshi

పగలకు వేదికలవుతున్న గణేష్ ఉత్సవాలు!

Published on Mon, 09/16/2013 - 02:04


 దోమ, న్యూస్‌లైన్: సంతోషంగా జరుపుకోవాల్సిన వినాయక చవితి ఉత్సవాలు పలు గ్రామాల్లో పగలు, ప్రతీకారాలకు వేదికలవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో తలెత్తిన వైషమ్యాలు ఉత్సవాల్లో పడగ విప్పుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర రూపం దాల్చిన విభేదాల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండల పరిధిలోని కిష్టాపూర్ అనుబంధ గ్రామం పలుగు తండాలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, నిమజ్జనం సమయంలో అతడిని శత్రువులే హత్య చేశారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.
 
  ఓ వర్గం నాయకులు కొందరు యువకులను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టించే యత్నం చేస్తున్నారు.  మంగళ, గురు వారాల్లో జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో శత్రువులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడడానికి రంగం సిద్ధం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వార్థపూరిత నాయకులు యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం  రాత్రి వేళల్లో భజన కార్యక్రమాల పేరుతో అంగడి బజార్‌లో వినాయకుడిని ఏర్పాటు చేసిన ఓ ముగ్గురు యువకులు పలువురు స్థానికులపై పాత కక్షల నేపథ్యంలో గొడవలకు దిగి దాడులకు పాల్పడడం, బాధితులు స్టేషన్ దాకా వెళ్లడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మండల పరిధిలోని దొంగెన్కెపల్లి, కొండాయిపల్లి, బడెంపల్లి, దిర్సంపల్లి, రాకొండ తదితర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. పలువురు ఉత్సవ కమిటీల నాయకులు ముందు జాగ్రత్త చర్యగా తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం సాయంత్రం 6 గంటల లోపు పూర్తి చేసేలా పోలీసులు కఠిన నిబంధనలు రూపొందించాలని పలువురు కోరుతున్నారు. గొడవలు సృష్టించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే అవాంఛనీయ ఘటనకు తావుండదని చెబుతున్నారు.
 
 
 

Videos

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌