amp pages | Sakshi

మావోయిస్టు ప్రాంతాల్లో పీఓ సుడిగాలి పర్యటన

Published on Thu, 01/01/2015 - 05:30

  • మారుమూల రోడ్లు పరిశీలన
  • ఇద్దరు వార్డెన్లకు షోకాజ్ నోటీసులు
  • గోమంగి వైద్యసిబ్బందిపై చర్యలకు ఆదేశాలు
  • పాడేరు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ ఈ ఏడాది ఆఖరి రోజున సాహసోపేత పర్యటన చేపట్టారు. మావోయిస్టులు సంచరించే ప్రాంతంలో పర్యటనలు మానుకోవాలని ఓవైపు పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో బుధవారం ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవడంతో పాటు  గిరిజన విద్యాలయాల్లో విద్యాభివృద్ధి, ఆస్పత్రుల్లో   వైద్య సేవలపై విస్తృత తనిఖీలు  చేపట్టారు.

    ముందుగా జి.మాడుగుల మండలంలోని నుర్మతి బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ అన్ని రికార్డులను పరిశీలించారు. 317 మంది విద్యార్థినులకు గాను 164 మంది మాత్రమే హాజరుకావడంపై పీవో అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉదయం 10 గంటల వరకు విద్యార్థుల హాజ రు నమోదు చేయకపోవడంపై హెచ్‌ఎం విధులను తప్పుపట్టారు.   

    వసతిగృహంలోని రికార్డుల్లో చూపిన సంఖ్య కంటే తక్కువ మంది పిల్లలు ఉండటంతోపాటు ఈ నెల 24 నుంచి మెనూలో చూపినట్లు గుడ్లు ఆహారంలో ఇవ్వకపోవడంపై  ఆగ్రహం వ్యక్తంచేసి డిప్యుటీ వార్డెన్‌కు షోకాజ్ నోటీసు  జారీ చేశారు. విద్యార్థులకు మరుగుదొడ్లు, విద్యుత్, నీటి సరఫరా సమస్యలపై దృష్టి సారించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. అనంతరం మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంగా గుర్తింపు పొందిన మద్దిగరువు నుంచి గోమంగి రోడ్డులో పీవో ప్రయాణించారు. దారి వెంబడి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు.   

    మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయిన రోడ్ల పరిస్థితిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.  గోమంగి ఆరోగ్య కేంద్రం సందర్శనకు వెళ్లినపుడు మూతపడి ఉండటంపై పీవో మండిపడ్డారు. గిరిజనులకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుపడుతూ వైద్యురాలు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏడీఎంహెచ్‌ఓను ఆదేశించారు. గోమంగి మినీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ అదనపు తరగతుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  

    బొండాపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి  హాజరుపట్టికలో చూపిన సంఖ్య కంటే తక్కువగా విద్యార్థులు ఉండటాన్ని గ్రహించారు. వసతిగృహంలోని స్టాక్ రిజిస్టర్‌లో ఎంట్రీలు అప్ టు డేట్‌గా లేకపోవడంతో వార్డెన్‌కు  షోకాజ్ నోటీసు జారీచేశారు. ఇక్కడ  అదనపు తరగతుల భవన నిర్మాణాలు, ఇతర సౌకర్యాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దిగరువు, బంగారుమెట్ట రోడ్డులో  చేపట్టిన హైలెవెల్‌వంతెన, అనేక రోడ్ల పనులను పరిశీలించి   ప్రగతిని తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమ ఈఈ ఎంఆర్‌జీ నాయుడు, పెదబయలు, జి.మాడుగుల డీఈఈలు పాల్గొన్నారు.
     

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)