amp pages | Sakshi

కట్టె పూడ్చుకో.. కనెక్షన్‌ తీసుకో!

Published on Wed, 05/15/2019 - 11:10

అనంతపురం సిటీ: పేదవారు విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారు. అదే బడా బాబులు దరఖాస్తు చేసుకుంటే మాత్రం మామూళ్లు తీసుకుని యథేచ్ఛగా కనెక్షన్‌లు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్టిమేషన్‌ లేకపోయినా ఏకంగా కట్టెలు పూడ్చి కనెక్షన్లు ఇచ్చేస్తున్నారంటే విద్యుత్‌శాఖలో ఈ దందా ఏ మేరకు సాగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ దందా ద్వారా జిల్లా వ్యాప్తంగా సంవత్సరానికి ఏకంగా రూ.50 నుంచి రూ.60 కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కిందిస్థాయి నుంచి ఉన్నత స్ధాయి వరకూ వాటాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో ఏడీ స్థాయి అధికారులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.

చేయాల్సింది ఇలా...
సాధారణంగా ఒక ఇంటికి గానీ షాపింగ్‌ కాంప్లెక్స్‌కి గానీ విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటికి అయితే రూ.1,450, షాపింగ్‌ కాంప్లెక్స్‌కి అయితే రూ.3,200 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగానే దీనికి సంబంధించిన ఎస్టిమేషన్‌ను తయారు చేయాలని ఏఈని ఆదేశిస్తారు. ఏఈ గానీ, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ గానీ వెళ్లి దరఖాస్తుదారుని ఇంటికి ఎన్ని స్తంభాలు పడతాయి? కేబుల్‌ వేయాలా, కండెక్టర్‌ వేయాలా అన్న విషయాన్ని ఎస్టిమేషన్‌ వేసి ఏడీకి అందజేయాల్సి ఉంటుంది. ఏడీ తిరిగి దాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుని అనుమతి నిమిత్తం దాన్ని డీఈ, ఎస్‌ఈలకు పంపాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్‌ అనంతరం దరఖాస్తుదారుడు డీడీ రూపంలో డబ్బు చెల్లించిన తర్వాత కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి మామూళ్లు తీసుకుని బడా బాబులకు ఇష్టారాజ్యంగా కనెక్షన్‌లు ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.

ఒక్కోచోట కొద్ది కొద్ది దూరంలో ఆరేడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఇక అధికారులకు పండగే. ఆయా ఇళ్ల యజమానులను పిలిపించి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ లేకుంటే పని జరగదని అందుకు కాస్త ఆలస్యమవుతుందని, కాబట్టి నలుగురూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నట్లు తెలిసింది. అయితే డీడీ కట్టే సమయంలో సైతం ఎస్టిమేషన్‌ ఎక్కువ అవుతుందని... ఇక మీరే తేల్చుకోండని నిర్ణయాన్ని ఇంటి యజమానులకే వదిలేస్తారు. ఎక్కువ ఎస్టిమేషన్‌ చూపి ఇంటి యజమానుల ద్వారా లంచాలు తీసుకుని కట్టెలతో పని కానిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఏడాదికి దాదాపు రూ.50 నుంచి 60 కోట్లు మామూళ్లుగా అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు ఇలా ఇచ్చిన కనెక్షన్ల కారణంగా జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 62 శాతానికి ఎస్టిమేషన్లే లేవని ఆ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా కలెక్టర్‌ చర్య తీసుకుని ఈ మామూళ్ల దందాకు చెక్‌ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నీటి సాకుతో బేరం షురూ...
గతంలో ఇంటి యజమాని దగ్గరుండి నిర్మాణాలను చేపట్టేవారు. ప్రస్తుతం కొంత సొమ్మును కాంట్రాక్టరుకు చెల్లించి నిర్ణీత కాల వ్యవధిలో ఇంటిని నిర్మించి ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు నీరు అవసరం గనుక వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ వేయించాలని యజమానిని కోరుతాడు. ఇక్కడి నుంచే అసలు దందా మొదలవుతోంది. యజమాని దరఖాస్తు చేసుకోగానే లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ లేదా ఏఈ వెళ్లి ఎస్టిమేషన్‌ వేసి ఏడీ పరిశీలన, డీఈ, ఎస్‌ఈల అనుమతికి కావాల్సిన స్తంభాలు రావడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని బెదరగొడుతున్నట్లు సమాచారం. దీంతో విద్యుత్‌ కనెక్షన్‌ లేని కారణంగా నీరు లేకపోతే నిర్ణీత సమయానికి ఇంటి నిర్మాణం పూర్తి కాదని భావించి యజమాని ఎంతైనా చెల్లించడానికి సిద్ధపడతాడు. దీన్ని అవకాశంగా తీసుకుని అధికారులు ఒక్కొక్కరి నుంచి రూ.40 నుంచి రూ.లక్ష వరకూ తీసుకుని బడాబాబుల ఇళ్లకు నిబంధనలకు విరుద్ధంగా కట్టెలను పూడ్చి కనెక్షన్‌ను ఇచ్చేస్తున్నారని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ అధికారులు ఈ తంతును కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)