ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్
Breaking News
పవర్హాలిడే
Published on Mon, 03/03/2014 - 05:04
గుంటూరు: జిల్లాలో 1,150 హెచ్టీ కనెక్షన్ల ద్వారా డిస్కమ్కు రూ.97 కోట్లు నెలకు వసూలవుతుంది. అధికారికంగా ఇప్పుడు వారానికి రెండు రోజులు పవర్హాలిడే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఈ వారం నుంచే ప్రతి శుక్రవారం పవర్హాలిడే అమలు కానుంది. అయితే ఈ లోగానే మరో రోజు పవర్హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పవర్హాలిడేలకు సంబంధించిన సమాచారం కానీ, మామూలు సమయాల్లో కరెంటు వాడుకున్నందుకు డిస్కం అధికారులు విధించే పెనాల్టీ(అపరాధ రుసుం) గురించి సరుకులన్నీ నాసిరకం..
పథకం ప్రారంభం నుంచే తాలు మిరపకాయల నుంచి తయారు చేసిన కారంపొడి సరఫరా చేస్తున్నారు. బర్మా కందిపప్పు, బియ్యం పొడి కలిపిన పసుపు, విత్తనాలతో కూడి నల్లగా ఉన్న చింతపండు, పొట్టుకలిసిన గోధుమ పిండి, ముక్కిపోయిన గోధుమలు సరఫరా చేయడం వల్ల కార్డుదారులు ఒకటి, రెండు సార్లు తీసుకుని ఆ తరువాత పూర్తిగా మానేశారు. అంతేకాకుండా ఈ వస్తువులపై కేవలం 25 పైసలు మాత్రమే కమీషన్ రావడంతో డీలర్లు కూడా అమ్మహస్తం సరుకులు తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇలా ఈ పథకం పూర్తి స్తాయిలో విఫలమైందని చెప్పవచ్చు. ఉదాహరణకు వినుకొండ నియోజకవర్గ పరిధిలో కొన్ని నెలలుగా అమ్మహస్తం సరుకులు అందడం లేదు. కొన్ని సరఫరా లేకపోగా మరికొన్ని నాసిరకంగా ఉండటం వల్ల తెచ్చేందుకు డీలర్లు ఆసక్తి చూపడం లేదు. పామాయిల్, దేశవాళి కందిప్పుకు డిమాండ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా లేక పథకం పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గత అక్టోబర్ నుంచి అన్ని రకాల వస్తువులు కార్డుదారులకు అందడం లేదని అంటున్నారు.
ఈ విషయమై వినుకొండ పట్టణంలోని గోదాముల ఇన్చార్జి రమణను ‘న్యూస్లైన్’ వివరణ కోరగా ఈ నెలలో పంచదార, కందిపప్పు, పామాయిల్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మిగిన వస్తువులు కూడా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
Tags