amp pages | Sakshi

ఆ కడుపుకోతకు కారణమెవరు?

Published on Mon, 02/26/2018 - 13:59

లబ్బీపేట (విజయవాడ తూర్పు): మెరుగైన వైద్యం అందుతుందని విజయవాడ  పాత ప్రభుత్వాస్పత్రికి వస్తే బాలింత ప్రాణాలే పోయాయి. వచ్చేటప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నా ఆపరేషన్‌ చేసే సమయంలో పొరపాటు జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండవల్లి మండలం గున్ననపూడికి చెందిన వంగా చిట్టెమ్మ శస్త్రచికిత్సను సీనియర్‌ రెసిడెంట్‌ చేయడం వల్లే పొరపాటు జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంట్రా వాస్కులర్‌ ప్రాబ్లమ్‌తో పాటు యూరిన్‌ బ్లాడర్‌ కూడా దెబ్బతినడంతో అనుభవం లేని వైద్యురాలు చేయడం వల్లే అలా జరిగి ఉండవచ్చని నిపుణులు అంచనాకు వస్తున్నారు.

ఎస్‌ఆర్‌లకు బాధ్యత ఉంటుందా?
ఒక ఏడాది కంపల్సరీ సర్వీస్‌ చేసేందుకు వచ్చిన సీనియర్‌ రెసిడెంట్‌లు ఎంతవరకు బాధ్యతగా విధులు నిర్వహిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శాశ్వత వైðద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పట్లేదు. దీంతో చిట్టెమ్మ లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రసూతి విభాగంలోనే కాకుండా అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. వారిపై ఆధారపడితే ఆస్పత్రి పరువు పోతుందంటున్నారు.

సూపరింటెండెంట్‌ సార్‌.. ఇప్పుడేమంటారు?
ఏడాది విధులు నిర్వహించి వెళ్లే వారిపై ఎలా ఆధారపడతామని, శాశ్వత వైద్యులు కావాలంటూ ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్‌ డి.రాజ్యలక్ష్మి కలెక్టర్‌ను కోరారు. తమ విభాగంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని, అర్హత ఉన్న వైద్యులను నియమించాలన్నారు. ఈ సమయంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చక్రధర్‌ జోక్యం చేసుకుని ఎస్‌ఆర్‌లతో చేయించుకోవాలంటూ వితండవాదం చేశారు. కలెక్టర్‌ సాక్షిగా ఈ వాదన జరగ్గా, ఇప్పుడు ఎస్‌ఆర్‌ చేసిన సర్జరీ వికటించి బాలింత మృతిచెందగా, సూపరింటెండెంట్‌ ఏం సమాధానం చెబుతారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుపేదల జీవితాలతో ఆడుకోకుండా వైద్యులను నియమించాల్సిన అవసరం ఉంది.

వీఆర్‌ఎస్‌పై వెళ్లిన గత హెచ్‌వోడీ
తమ విభాగంలో తీవ్రమైన వైద్యుల కొరత ఉందని, సౌకర్యాలతో పాటు వైద్యుల సంఖ్య పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రితో పాటు ఇతర అధికారులు మంత్రులతో జరిగిన సమావేశంలో గత హెచ్‌వోడీ ప్రాధేయపడ్డారు. ఆమె మొరను ఎవరూ ఆలకించలేదు. పైగా ఏదైన ఘటన జరిగితే వైద్యులనే నిందించడం ప్రారంభించారు. దీంతో ఇక్కడ చేయలేమని భావించిందో ఏమో వీఆర్‌పై వెళ్లిపోయింది. ఆమె వెళ్లి రెండేళ్లు గడస్తున్నా పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. ఇప్పుడున్న వైద్యులు సైతం అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు.

అన్నీ చేశామంటారు.. ఇక్కడేం లేవు
ప్రభుత్వాస్పత్రులకు అన్నీ చేశాం.. నాలుగేళ్లలో కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లామని వైద్యమంత్రి తరచూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. పడకలు 90 నుంచి 240కు పెంచారు. పెరిగిన పడకలకు వైద్యులు, సిబ్బంది ఎక్కడ నుంచి వస్తారనే ఆలోచన చేయలేదు. నాలుగేళ్ల కిందటే ప్రస్తుతం ప్రసూతి విభాగంలో మూడు యూనిట్‌లు ఉండగా, ఆరు యూనిట్‌లు చేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, దానిపై ఇప్పటికీ స్పందన లేదు. మరి నిరుపేదలకు మెరుగైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఒక్కరే అసిస్టెంట్‌.. పది సిజేరియన్‌లు
రోజూ సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఒక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విధుల్లో ఉంటారు. ఆ సమయంలో పది సిజేరియన్‌లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరో పది నుంచి పదిహేను సాధారణ డెలివరీలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరికి చేయాలంటే ఎస్‌ఆర్‌లపై ఆధారపడక తప్పదు. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటే అలాంటి పరిస్థితి తలెత్తదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిపుణులైన వైద్యులు మరింత మందిని నియమించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)