amp pages | Sakshi

అటవీ భూములను రక్షించండి

Published on Fri, 11/04/2016 - 02:37

- పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదన
- ఎన్జీటీలో అమరావతి నిర్మాణంపై విచారణ
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం సహజ వనరుల వినాశనానికి పాల్పడుతోందని, అటవీ భూములను, నీటి కుంటలనుసైతం వదలడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో రాజధాని నిర్మాణంపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి అమరావతిని ప్రభుత్వం ఎంచుకోవడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కూడా విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 251 ఎకరాల అటవీ భూమిని సేకరించడానికి ప్రయత్నిస్తోందని, అలాగే 497 ఎకరాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన నీటి కుంటల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. వీటిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిత్తడి నేలలు ఉన్న అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే కొండవీటి వాగు, కృష్ణా నది నాశనం అవుతాయన్నారు. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని, రాజధాని నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరారు.

 విచారణ నేటికి వాయిదా..
 ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటి దాకా పిటిషనర్ల్లు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందన తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ‘‘ఏటా మూడు పంటలు పండే ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందనేది స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు ఏంటి?. భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఏ విధంగా చెల్లిస్తారు. కొండవీటి వాగు ప్రవా హ దిశ మార్పు అభ్యంతరాలపై సమాధాన మేమిటి?, 10-15 మీటర్లలో భూగర్భ జలా లు లభించే ప్రాంతంలో అభివృద్ధి పేరిటి చేపడుతున్న ఇసుక మైనింగ్‌పై మీ వివరణ ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటికీ సమాధానం కోరుతూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌