amp pages | Sakshi

రైల్వే ఆదాయం అంతంత మాత్రమే!

Published on Fri, 10/04/2013 - 01:22

విజయవాడ, న్యూస్‌లైన్  : రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడంతో   రెండు నెలల నుంచి రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే రైళ్లకు ఈ సమైక్య సెగ తగలకపోవడంతో యథావిధిగా నడవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోగలిగింది. కానీ ఆదాయం పెరుగుదల అనుకున్నంత మేర రాలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయం పెంచుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు మరికొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను  ఏర్పాటు చేశారు.

అయితే విజయవాడ రైల్వే డివిజన్‌లో గత సంవత్సరం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఈ ఏడాది ఏర్పాటు చేసిన అదనపు రైళ్లు, కోచ్‌లు ఈ విధంగా ఉన్నాయి. 2012-13లో ఆగస్టులో విజయవాడ మీదుగా 23 ప్రత్యేక రైళు,్ల సెప్టెంబర్ నెలలో 34 ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలలో 62, సెప్టెంబర్ నెలలో 90 ప్రత్యేక రైళ్లు నడిచాయి. అదేవిధంగా విజయవాడ డివిజన్‌లో ఈ ఆగస్టులో 10, సెప్టెంబర్‌లో 12 ప్రత్యేక రైళ్లను నడపగా వీటి ద్వారా 10 రైళ్లకు గానూ రూ.22,21,887 ఆదాయం రాగా, సెప్టెంబర్‌లో నడిపిన 12 రైళ్లకు గానూ రూ.31,43,900 ఆదాయం లభించింది.

ఇవి కాక పలు రైళ్లకు 2012-13 సంవత్సరంలో ఆగస్టు నెలలో 76 అదనపు కోచ్‌ల  ద్వారా రూ.  29,48,622 ఆదాయం, సెప్టెంబర్‌లో 83 అదనపు కోచ్‌ల ద్వారా  రూ.29,94,440 ఆదాయం లభించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో 33 అదనపు కోచ్‌లకు గానూ రూ.9,53,160 ఆదాయం రాగా, సెప్టెంబర్ నెలలో నడిపిన 37 అదనపు కోచ్‌లకు గానూ రూ.14,54,857 ఆదాయం లభించింది. దీని ద్వారా రైల్వేకు వచ్చిన ఆదాయం నామమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా ప్రతిరోజు దాదాపు 500 నుంచి600 బస్సులు నడుస్తూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉండేవి. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వద్ద నుంచి ప్రయాణికులు తమ రాకపోకలను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఈ సమ్మె కొనసాగినట్లయితే ఆ ప్రభావం అన్ని విభాగాలపై పడే అవకాశముంటుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌