amp pages | Sakshi

ఉప్పుటేరును మింగేస్తున్నారు..!

Published on Wed, 07/24/2019 - 12:59

సాక్షి, కృష్ణా: సామాన్యుడి ఇల్లు రోడ్డు నిర్మాణం పేరుతో తొలగిస్తే అతనికి మరో చోటు ఆశ్రయం కల్పించడానికి సెంటు భూమి కూడా ఇవ్వలేరు.. నిరుపేదల కష్టాలు వారికి పట్టనే పట్టవు. కానీ రూ.కోట్ల  విలువైన పక్కా నిర్మాణాలు చేసుకోవడానికి, భారీ స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి ఉప్పుటేరు, ఇరిగేషన్, డ్రెయినేజీ భూములను ఆక్రమించుకుని అనుమతి లేని నిర్మాణాలు చేస్తుంటే కనీసం అటువైపు అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు.. ఇదీ  కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలోని దుస్థితి. జిల్లాకు శివారు ప్రాంతమైన లక్ష్మీపురంలో రూ.కోట్ల  విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిపై అధికారులు అజమాయిషీ కొరవడటంతో    భారీ కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇవి మరింత జోరందుకున్నాయి. నాటి పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైపోయాయి.

అంతా బంగారమే!
జిల్లాకు శివారునున్న లక్ష్మీపురం పంచాయతీలో ఇప్పుడు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక్కడ భూమి విలువ ప్రధాన పట్టణాలకంటే అధికంగా పలుకుతుంది. లాకు సెంటరులో అధికంగా ఇరిగేషన్, ఉప్పుటేరు పోరంబోకు భూములున్నాయి. వీటిని స్థానికులు కొందరు ఆక్రమించుకుని భారీ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూముల్లో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేయడం వెనుక గతంలో రాజకీయ పెద్దల హస్తంతో పాటు, అధికారులు అండ కూడా పుష్కలంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి.

ఉప్పుటేరును పూడ్చి..
లక్ష్మీపురం లాకు సెంటర్‌ మీదుగా కొల్లేరు నీటిని సముద్రంలోకి చేరవేసే ఉప్పుటేరు పాయ ప్రవహిస్తుంది. దీన్ని పూడ్చుకుంటూ కొందరు కట్టడాలు నిర్మించగా, మరి కొందరు భారీ ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడి నిర్మాణాలకు పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు.  లాకుల  వద్ద ఇరిగేషన్‌న్‌ భూముల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు రహదారిని ఆనుకుని య«థేశ్ఛగా జరుగుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేదల ఇళ్లు తొలగించినా..
216 జాతీయ నిర్మాణం పేరుతో లక్ష్మీపురంలో కొందరి పేదల ఇళ్లు తొలగించారు. ఇంతవరకు బాధితులకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించలేదు. కాని తమ కళ్ల ముందే రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు ఈ ఆక్రమణలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.

అధికారులు స్పందిస్తారా..?
కృష్ణా నది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ఇటీవల అధికారులు కూల్చివేసినట్టుగానే ఉప్పుటేరు, ఇరిగేషన్‌ భూముల్లోని అక్రమ కట్టడాల విషయంలో కూడా చర్యలు తీసుకుంటారా? అనే సందేహం ప్రజల్లో  నెలకొంది.  వీటిపై పంచాయతీ అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వ భూముల్లో కట్టడాలకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌