amp pages | Sakshi

‘గురు’తర బాధ్యత మరువొద్దు

Published on Sat, 09/06/2014 - 01:14

  • ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేయాలి
  •   ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత
  •   జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ
  •   ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
  • విశాఖపట్నం : ‘ఈయనే మా గురువు’ అని జీవితాంతం చెప్పుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఎన్.యువరాజ్, ఇతర అధికారులతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో కంటే పాఠశాలలో ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం గడుపుతారన్నారు. అందువల్ల పిల్లలకు ఉపాధ్యాయులతోనే ఎక్కువ అనుబంధం ఉంటుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఉద్యోగ బాధ్యతలో భాగంగా పాఠశాలకు సమయానికి హాజరుకావాలన్నారు. 58 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారికి ఉత్తమ బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

    వచ్చే ఏడాది నుంచి ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు పదో తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ.2 వేలు, బీ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ. 1500 ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అలాగే సబ్జెక్టుల వారీగా ప్రథమ ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ తరగతి గదుల్లో మొదలవుతుందన్నారు. వారికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు మన గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయ వృత్తికి వన్నె తేవాలన్నారు.
     
    ఈ ఏడాది ప్రతిభను కనబరిచిన 23 మంది స్పెషల్ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, 3 డివిజన్ల మండల విద్యాశాఖాధికారులు మొత్తం 23 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

    డిప్యూటీ డీఈఓ సి.వి.రేణుక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వర్‌రెడ్డి, సర్వశిక్షా అభియాన్ పీఓ బి.నగేశ్, యలమంచిలి డిప్యూటీ డీఈఓ లింగేశ్వర్‌రెడ్డి, జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
     

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు