అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాశీ యాత్రకు వెళ్లొస్తుండగా విషాదం..
Published on Mon, 05/09/2016 - 10:39
మారేడుపల్లి: కాశీ యాత్రకు వెళ్లొస్తున్న ఓ భక్త బృందం ప్రమాదం బారిన పడింది. వారు ప్రయాణిస్తున్న బస్సు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం ఇజ్జలూరి జంక్షన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చింతగింజల విజయ (50) అనే మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, శ్రీరామ్పూర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 47 మంది గత నెల 29వ తేదీన కాశీయాత్రకు బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం అన్నవరం చేరుకుని సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున భద్రాచలం బయల్దేరారు. ఇజ్జలూరు జంక్షన్ సమీపంలో మలుపులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
#
Tags