amp pages | Sakshi

బియ్యం ధరలకు రెక్కలు

Published on Tue, 05/29/2018 - 12:53

కారంచేడు:  బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటున్న తరుణంలో బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నాయి. మార్కెట్లో బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతుంటే ఉద్యోగులు పెరుగుతున్న ధరలను చూచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నెల నెలా బియ్యం ధరలు పెరుగుతుంటే ఎలా కొనుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్ల క్రితం వరిసాగు లేకపోవడమే..
జిల్లా ధాన్యగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలో రెండేళ్ల క్రితం ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. సాగుకు అసవరమైన నీరు లేకపోవడంతో వరి సాగు 80 శాతానికి పైగా నిలిచిపోయింది. దీంతో ధాన్యం లోటు వచ్చింది. రైతుల ఇళ్లల్లో పురులు ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో వారంతా తిండి గింజలకు కూడా వారు వెతుక్కునే పరస్థితి వచ్చింది. తరువాత ఏడాది మాగాణి సాగు బాగానే ఉంది. అయినా రెండు సంవత్సరాల ప్రభావంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. బియ్యం మిల్లర్లు, వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం 2 వేల ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 25 వేల ఎకరాల్లో వరి సాగుంది. రెండేళ్ల క్రితం 60 వేల క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ ఏడాది 8,75,000 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

ధాన్యం ధరలపై స్పస్టత లేదు..
జిల్లాలోనే అత్య«ధికంగా వరి సాగు చేసే ప్రాంతంగా కా>రంచేడు మండలం ప్రసిద్ధి,. ఈ ఏడాది కొమ్మమూరు కాలువ పరి«ధిలో సుమారు లక్ష ఎకరాల్లో అ«ధికారిక, అనధికారిక లెక్కల ప్రకారం వరి సాగైంది. దీంతో ఎకరానికి 35 బస్తాల చొప్పున 35 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడులున్నాయి. ధాన్యం ధరల్లో మాత్రం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.  ధాన్యానికి ప్రస్తుతం దళారులు బస్తా (75 కేజీలు) ’ రూ.1700–1750 వరకు కొనుగోలు చేస్తున్నారు. రూ.2000 ధర ఇస్తే రైతులకు ఊరటగా ఉంటుందని వారు వాపోతున్నారు.

బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి: ప్రస్తుతం బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ ధరలు లేవు. గత ఏడాది 25 కేజీల బియ్యం బస్తా రూ.1100  ఉంటే ఈ ఏడాది బియ్యం బస్తా రూ.1250లకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిరుద్యోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.- పి. శ్రీనివాసరావు, కారంచేడు

బియ్యం ధరలు అదుపు చేయాలి: వై బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం గానీ అ««ధికారులు గానీ వీటిని అదుపు చేయాల్సి ఉంది. కేజీ రూ.50 వరకు ఉంది.  ఒక కుటుంబంలో రోజుకు రెండు కేజీల చొప్పున బియ్యం ఖర్చుకే రూ. 100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సగటున నెలకు బియ్యానికే రూ.2,500 వరకు ఖర్చవుతోంది.  -సుబ్బారావు, కారంచేడు

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)