amp pages | Sakshi

కాన్పు కోసం వచ్చి గర్భిణి మృతి

Published on Mon, 11/12/2018 - 08:03

ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలు మాతా శిశు వైద్యశాలకు కాన్పు కోసం వచ్చిన గర్భిణి మృతి చెందడంతో ఆమె బంధువులు ఆదివారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన పారాబత్తిన లక్ష్మి (21) అనే యువతి గర్భం ధరించినప్పటి నుంచి ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఈ నెల 9న వైద్యులు కాన్పు తేదీ ఇవ్వడంతో అదే రోజు ఉదయం వైద్యశాలలో చేరింది. మరుసటి రోజు వైద్యులు కాన్పు చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలింతకు ఆరోగ్యం బాగాలేదని తిరిగి లేబర్‌ గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పరిస్థితి విషమించిందని, లక్ష్మిని రిమ్స్‌ ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది.

మృతురాలి బంధువుల కథనం ఇలా..
లక్ష్మికి వైద్యులు కాన్పు చేయలేదని, అక్కడ విధుల్లో ఉన్న నర్సులు చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మొదటి కాన్పు కావడంతో ఆమె తీవ్రంగా నీరసించిపోయింది. కాన్పు అనంతరం మాయ బయటకు రాలేదని, వైద్య సిబ్బంది గట్టిగా బయటకు లాగారని చెబుతున్నారు. గర్భసంచి కుడా బయటకు వచ్చిందని, ఈ నేపథ్యంలోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్రమత్తమైన నర్సులు వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు గర్భ సంచిని తిరిగి లోపలికి నెట్టి చికిత్స చేశారు. తీవ్ర రక్తస్రావమైంది. ఆ తర్వాత చికిత్సకు యువతి స్పందించకపోవడంతో మెరుగైన చికిత్స కోసం శనివారం ఉదయం 11 గంటల సమయంలో రిమ్స్‌కు తరలించారు.

అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం లక్ష్మి మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రులు రిమ్స్‌లో ఆందోళన చేశారు. ఎంసీహెచ్‌ వైద్యులు సరిగ్గా కాన్పు చేయకపొవడంతోనే మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.

మృతదేహంతో ఎంసీహెచ్‌కు
బాధితురాలి బంధువులు రిమ్స్‌ నుంచి మృతదేహంతో ఎంసీహెచ్‌కు చేరుకుని అక్కడ క్యాజువాలిటీ ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఒన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌ ఎంసీహెచ్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడారు. బాధితులు తమకు న్యాయం చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని కూర్చున్నారు. పొలీసులు వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

వైద్యులు, నర్సులపై పొలీసులకు ఫిర్యాదు
కాన్పు కోసం వచ్చిన లక్ష్మికి సరైన వైద్యం అందించలేదని మృతురాలి బంధువులు, భర్త ఒన్‌టౌన్‌ పొలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాధారణ కాన్పు చేశాం
లక్ష్మికి సాధారణ కాన్పు చేశాం. అయితే కాన్పు అయిన అనంతరం గర్భసంచి ముడుచుకోలేదు. మాయ బయటకు రాలేదు. దానికి సంబంధించిన చికిత్స అందించాం. అనంతరం రక్తస్రావం అవుతుండటంతో మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించాం. అక్కడ వార్డులో చేర్పించాం. అనంతరం పరిస్థితి విషమించి ఐసీయూలో మృతి చెందింది.– డాక్టర్‌ ఉషారాణి, సూపరింటెండెంట్, ఎంసీహెచ్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)