amp pages | Sakshi

మట్టి దొంగలు

Published on Sat, 05/11/2019 - 11:48

అనంతపురం :కూడేరు మండలంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్నవెంచర్లను అడ్డుపెట్టుకొని కొందరు టీడీపీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారమొత్తి ప్రభుత్వ భూముల్లోని మట్టిని
తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులూ తమవాటాలను తీసుకోవడమే కాకుండా వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారన్నవిమర్శలున్నాయి.

భారీగా వెంచర్లు
మండల పరిధిలోని గొటుకూరు, బ్రాహ్మణపల్లి, కమ్మూరు, అరవకూరు, కూడేరు వద్ద భారీగా వెంచర్లు వెలిశాయి.  వెంచర్లలోకి రోడ్లుకు, ఇతర పనులకు  ఎర్ర మట్టి అత్యవసరమవుతోంది. దీంతో ఎర్ర మట్టి కోసం కొందరు అక్రమార్కులు ప్రభుత్వానికి సంబంధించిన కొండలు, వంకలు, గుట్టలను ఎంపిక చేసుకొని ఎలాంటి అనుమతులు పొందకుండా  జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో  ఇష్టారాజ్యంగా  మట్టిని  తోడేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న వారు టీడీపీకి చెందిన వ్యక్తులు కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ గ్రామాలకు నియమించిన ఓ అధికారి టీడీపీకి కొమ్ముకాయడంతో పాటు  ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్నీ తానై చూసుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. అక్రమ మట్టి తరలింపుపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఈ విషయాన్ని అక్రమార్కులకు చేరదీసి కొద్ది రోజులు మట్టి తరలింపుకు బ్రేక్‌ వేయించి తిరిగా యథేచ్చగా తరలించేలా చేస్తున్నాడని చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు మామూళ్ళ మత్తులో మునిగి తేలుతుండటతో మట్టి తరలింపునకు అడ్డు అదుపు లేకుండా పోయింది.  రోడ్డు పనులకు, ఇంటి ముందు  వేసుకునేందుకు , మొక్కల పెంపకానికి ఇలా అనేక రకాలుగా ఎర్ర మట్టిని ఉపయోగించుకుంటున్నారు. 

తమ్ముళ్లకే మట్టితరలింపు కాంట్రాక్ట్‌
కొత్తగా వెలసిన వెంచర్లే ఆ ప్రాంత, అనంతపురానికి చెందిన టీడీపీ నాయకులకు ఆదాయ వనరులుగా మారాయి. అధికార అండతో తామేమి చేసిన చెల్లుబాటు అవుతుందని ఎలాంటి అనుమతులు లేకుండానే ఆ ప్రాంతంలోని గుట్టలు, వంకల్లో వేలాది ట్రాక్టర్ల మట్టిని తరలించి ఆర్ధికంగా లాభపడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని మట్టిని కాకుండా ఏకంగా అనంతపురం – బళ్ళారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములైన కొండలు, వంకల్లోని మట్టిని తరలిస్తుండటం గమనార్హం. వెంచర్ల యాజమాన్యంతో మట్టి తరలింపునకు టీడీపీ నాయకులు కాంట్రాక్ట్‌ తీసుకొని జేబులను నింపుకుంటున్నారు. వారి అనుమాయులకు చెందిన ట్రాక్టర్లనే తిప్పుతూ వారి పనులకు అడ్డం లేకుండా చేసుకుంటున్నారు.

కొండనూ తోడేశారు
కూడేరులో జోడు లింగాల సంగమేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న  ప్రభుత్వ భూమి సర్వేనంబర్‌ 535లోని కొండను టీడీపీ నాయకులు జేసీబీలు పెట్టి వందలాది ట్రాక్టర్లతో మట్టిని  ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. టీడీపీ నాయకులు వర్గాలుగా మారి వారికి అనుకూలమైన చోటకు మట్టిని తోలి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఎస్‌ఆర్‌సీ కంపెనీ ప్రతినిధులు రోడ్డు పనికి  వందలాది టిప్పర్ల మట్టిని అనుమతులు లేకుండా తోడేశారన్న విమర్శలున్నాయి. అక్రమంగా ఇంత పెద్ద ఎత్తున మట్టి తరలిస్తుంటే అధికారులకు కనబడదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టి ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయంపై తహసీల్దార్‌ భాగ్యలతను వివరణ కోరేందుకు  ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

పట్టించుకోని అధికారులు
రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీసులు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప వీటికి అనుమతి ఉందా? లేదా? అని విచారించిన పాపాన పోవడం లేదు. అక్రమార్కుల నుంచి డబ్బులు వసూల్‌ చేసుకొని తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంత బహిరంగంగానే మట్టి దందా కొనసాగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Videos

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)