amp pages | Sakshi

డెంగీపై కలెక్టర్ సీరియస్

Published on Mon, 07/20/2015 - 02:45

- డీఎంఅండ్‌హెచ్‌వోపై తీవ్ర ఆగ్రహం
- హెల్ప్‌లైన్ సరిగాలేదని మండిపాటు
- ఎంపీహెచ్‌ఈవో సస్పెన్షన్‌కు ఆదేశాలు
చిత్తూరు (అర్బన్):
జిల్లాలో డెంగీ జ్వరాలు.. మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మండిపడ్డారు. డెంగీ జ్వరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సరిగా అమలు చేయలేదని మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో) కరుణాకరన్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో విష జ్వరాలు.. డెంగీ జ్వరాలు ప్రబలడంతో పలువురు చనిపోతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ, జిల్లా పంచాయతీ అధికారి, మునిసిపల్ అధికారులతో కలెక్టర్ ఆదివారం చిత్తూరులోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విష జ్వరాలు తీవ్రమవుతున్న తరుణంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారని డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు.

దీనిపై డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ పశ్చిమ మండలాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి, స్థానిక వైద్యులకు సూచనలు ఇచ్చానని చెప్పారు. ప్రజలకు జ్వరాలపై వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్‌లైన్ నెంబరు సైతం ఏర్పాటు చేశానని తెలిపారు. అప్పటికే హెల్ప్‌లైన్ నెంబరు పనిచేయడంలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు రావడంతో డీఎంఅండ్‌హెచ్‌వో ఎందుకు దీన్ని పర్యవేక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల్లో, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే శుభ్రం చేయించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ చెత్త తొలగింపుపై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల్లో ఎన్ని జ్వరాల కేసులు నమోదయ్యాయని డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు.

ప్రతి రోజూ నమోదవుతున్న జ్వరాల కేసులపై వెంటనే స్పందించాలన్నారు. దోమల నివారణకు వైద్యశాఖ అధికారులు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా ఎంపీహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రధానంగా మదనపల్లె, పీలేరు, పుంగనూరు మండలాల్లో విష జ్వరాలు ఎక్కువగా వస్తుండటంతో ఎంపీహెచ్‌ఏలు, సూపర్‌వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు పది రోజుల పాటు అక్కడ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటా తిరిగి జ్వరాలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లా మలేరియా విభాగం అధికారి దోసారెడ్డి, చిత్తూరు కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు పాల్గొన్నారు.
 
కార్మికులు సమ్మె విరమించాలి...
జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం వల్ల ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే పేరుకుపోయాయని కలెక్టర్ పేర్కొన్నారు. దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు విష జ్వరాలను కలుగచేస్తున్నాయన్నారు. వెంటనే విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరుకాకపోవడంపై చిత్తూరు ఇన్‌చార్జ్ కమిషనర్ శ్రీనివాసరావుపై అసహనం వ్యక్తం చేశారు. వారికి షోకాజు నోటీసులు జారీ చేయాలని చెప్పారు.
 
మునిసిపాలిటీల్లో అదనపు సిబ్బంది తీసుకోండి
జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు మునిసిపాలిటీల్లో  పారిశుద్ధ్యం మెరుగు పడాలని కలెక్టర్ సిద్ధార్థ్థ్‌జైన్ ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు,  వైద్యాధికారులు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో వాళ్లను ఒప్పించి విధులకు హాజరయ్యేలా చూసే బాధ్యత ఆయా ఆర్డీవోలదేనన్నారు. సిబ్బంది అంగీకరించని పక్షంలో అదనపు సిబ్బందిని తెప్పించుకుని పారిశుద్ధ్య పనులు చేయించాలన్నారు.

జ్వరాలపై అశ్రద ్ధ చేయకుండా గ్రామాల్లో వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక రుయా, స్విమ్స్, వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిల్లో ఆరోగ్యమిత్రలను ఏర్పాటు చేసి విషజ్వరాలతో వచ్చే జిల్లా వాసుల వివరాలు, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్చవేక్షించాలన్నారు. వసతి గృహాల్లో సైతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రిన్సిపాళ్లను వైద్యాధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు, మదనపల్లె సబ్ కలెక్టర్ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరి, డీపీవో ప్రభాకరరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)