amp pages | Sakshi

ప్రజల సమస్యలు తీర్చేందుకే ‘స్పందన’

Published on Wed, 06/26/2019 - 09:04

సాక్షి, పులివెందుల(కడప) : ప్రజల సమస్యలు తీర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్వగృహం వద్ద ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకే  ప్రజావేదిక తొలగించడానికి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజా వేదికే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ఎవరూ స్వాధీనం చేసుకున్నా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్‌ అధికారం చేపట్టి నెల రోజులు కూడా గడవకమునుపే తనదైన శైలిలో పరిపాలన చేస్తున్నారన్నారు. జగన్‌ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు.

టీడీపీ నాయకులు తమ అవినీతి కప్పిపుచ్చుకునేందుకు బీజేపీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా సాధించి తీరుతామన్నారు. కేంద్రంలోని బీజేపీకి ఎలాంటి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కృషి చేస్తామన్నారు. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా ఉండి ముందుకెళతామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామిలను ఏ ఒక్కటి కూడా మరిచిపోకుండా అమలు చేస్తామన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా ప్రజలకు పాలకులుగా కాకుండా సేవకులుగా ఉండి సేవలందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సువర్ణపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. మంగళవారం ఉదయం పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డితో కలిసి ఆర్‌ఎంపీ డాక్టర్లు వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎంపీతో మొరపెట్టుకున్నారు. 429జీఓను పునరుద్ధరించాలని విన్నవించుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌