amp pages | Sakshi

కోస్ట్‌గార్డు స్టేషన్ ప్రారంభం

Published on Wed, 11/26/2014 - 01:22

నిజాంపట్నం: సముద్ర తీరప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తీరప్రాంత రక్షణ చర్యల్లో భాగంగా నిజాంపట్నంలో మంగళవారం కోస్ట్‌గార్డు స్టేషన్ ఏర్పాటు చేశారు.  ఇండియన్ కోస్ట్‌గార్డు డెరైక్టర్ జనరల్ అనురాగ్ జి తప్లియాల్ స్టేషన్‌ను ప్రారంభించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

2008లో ముంబై తీర ప్రాంతం నుంచి ఉగ్రవాదులు నగరంలోకి చొరబడి సృష్టిం చిన హింసాకాండను ఎప్పటికీ మరువలేమన్నారు. అలాంటి ఘటనలకు తావు లేకుండా తీరంలో పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన కోస్ట్‌గార్డు స్టేషన్ తీరప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగిస్తుందని చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో తీరప్రాంతంలోని ప్రజల రక్షణకు కోస్ట్‌గార్డు సిబ్బంది పూర్తి సహాయసహకారాలు అందిస్తారన్నారు.
హుదూద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారీ నష్టం సంభవించకుండా కోస్ట్‌గార్డ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేశారన్నారు.

నిఘా విషయంలో మత్స్యకారుల సహకారం కీలకమైందన్నారు. దేశరక్షణకు మత్స్యకారులు అంకిత భావం తో సమాచారం అందించి సహకరించాలని కోరారు.

సముద్రంలో వేట చేస్తున్న సమయంలో అపరిచిత బోట్లు, వ్యక్తులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన మత్స్యకారులకు సూచించారు.

15 వేల మంది జనాభా ఉన్న నిజాంపట్నం పంచాయతీ పరిధిలో కోస్ట్‌గార్డు స్టేషన్ ఏర్పాటు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

తొలుత కోస్ట్‌గార్డు సిబ్బంది గౌరవవందనం స్వీకరించారు. జాతీయ జెండా, కోస్ట్‌గార్డు జెండాలకు వందన సమర్పణ చేశారు.అనంతరం కోస్ట్‌గార్డు స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ కోస్ట్‌గార్డు ఐజి ఎస్‌పి.శర్మ, కోస్ట్‌గార్డు డీఐజీ శబర్‌వాల్, కోస్ట్‌గార్డు అధికారి  ఏకేఎస్ పన్వర్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)