amp pages | Sakshi

వైఎస్‌ జగన్‌కు చెరకు రైతుల వినతి

Published on Wed, 10/17/2018 - 11:16

సాక్షి , విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు కలిసి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఇందులో భాగంగా రంగరాయపురం వద్ద చెరకు రైతులు కలిసి వినతి పత్రం అందజేశారు. గత ఏడాది రైతులకు బకాయిలు ఉన్న రూ.13 కోట్లు ఎన్‌సీఎస్‌ ఘగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సుజయ కృష్ణా రంగారావు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా తమ సమస్య పరిష్కారం కాలేదని రైతులు గోడు వెల్లబోసుకున్నారు. బకాయి బిల్లుల కోసం ఉద్యమిస్తామంటే రైతులపై పోలీసు కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ఎన్‌సీఎస్‌ ఘగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలని కోరారు.

సరైన రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం: విద్యార్థులు

ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను స్కూలు విద్యార్థులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పాత పెంట ప్రభుత్వ స్కూల్‌కి రోడ్డు లేక వెళ్లలేకపోతున్నామని వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ఎం.బూర్జివలస, ఎం.పనుకువలస, కొత్తపెంట, గుణతోటవలస పరిసర ప్రాంతాల విద్యార్థులు పాత పెంట స్కూలులోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. 15 ఏళ్ల క్రితం మట్టి రోడ్డు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.

ఇప్పుడా రోడ్డు గుంతలమయం అయిందన్నారు. వర్షం పడితే నడవటానికి కూడా వీలులేని దుస్థితి ఆ రోడ్డులో ఉందని చెప్పారు. తమ ప్రాంతాల నుంచి బొబ్బిలి మీదుగా 15 కిలోమీటర్లు తిరిగి రావలసి వస్తోందని బాధ వ్యక్తం చేశారు. 500 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నామని, స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు వేయించాలని వైఎస్‌ జగన్‌ను కోరారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)