amp pages | Sakshi

పాలనపై చంద్రబాబుకు పట్టు లేదు

Published on Sun, 07/01/2018 - 08:12

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు కోల్పోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇస్తున్నారని, దాంతో అధికారులు ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం ఇక్కడి మల్లయ్య లింగం భవన్‌లో నిర్వహించిన సీపీఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో, అంతకు ముందు విలేకర్ల సమావేశంలో పార్టీ విధానాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పుతామని, పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర సామాజిక శక్తులను కలుపుకొని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ముందుకు వెళ్తాయన్నారు. 

తమ పార్టీలు మూడు అంశాల్లో భావసారూప్యత కలిగి ఉన్నాయన్నారు. సామాజిక న్యాయం అమలు కాకపోవడం, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోవడం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. నెల్లూరులో ఒక అటెండర్‌ను ఏసీబీ వాళ్లు పట్టుకుంటే రూ.100 కోట్లు, విజయవాడలో ఒక టీపీఓని పట్టుకుంటే రూ.500 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయంటే అవినీతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 

జిల్లా వెనుకబాటుపై 22న ఒంగోలులో భారీ సదస్సు
ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంపై సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలులో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. సదస్సు తీర్మానాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో, చేతివృత్తిదారుల సమస్యలపై ఏలూరులో, దళితుల సమస్యలపై రాజమండ్రిలో, అర్బన్‌ సమస్యలపై విజయవాడలో, రైతుల సమస్యలపై గుంటూరులో, విద్యార్ధి – యువజన సమస్యలపై తిరుపతిలో, మహిళల సమస్యలపై అనంతపురంలో, మైనార్టీల సమస్యలపై కర్నూలులో, వ్యవసాయ కార్మికుల సమస్యలపై నెల్లూరులో, వెనుకబడిన ఉత్తరాంధ్ర సమస్యలపై శ్రీకాకుళంలో, వెనుకబడిన రాయలసీమ సమస్యలపై కడపలో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 15వ తేదీ విజయవాడలో భారీ ర్యాలీ, సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.

90 లక్షల మంది రోడ్డుపాలు
కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ 2.64 లక్షల కంపెనీలు మూసివేయించి 90 లక్షల మందిని రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు. విదేశీ బ్యాంకుల్లో 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంటే దానిని ఇంతవరకు బయటకు తేలేదన్నారు. దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక్క శాతం వ్యక్తుల చేతుల్లో ఉందని, మిగిలిన 27 శాతాన్ని కూడా వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు పీజే చంద్రశేఖరరావు, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, నాయకుడు ఆర్‌.వెంకట్రావు పాల్గొన్నారు.
 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)