amp pages | Sakshi

కార్డు పని చేయదు..వైద్యం అందదు

Published on Wed, 03/21/2018 - 12:08

ఉద్యోగులకు నగదురహిత వైద్యంప్రకటనలకే పరిమితమైంది.వారికిచ్చిన హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి.నెలనెలా ప్రీమియం వసూలుచేస్తున్నా వైద్యం అందించే విషయంలోసర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు నగదు రహితవైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి.దీంతో తప్పని పరిస్థితిలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ చేతిలో నుంచి డబ్బులు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది.  

కడప ఎడ్యుకేషన్‌: నగదు రహిత వైద్యం అమలుకు నోచుకోవడం లేదు.   ఉద్యోగ, ఉపాధ్యాయ, òపెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత వి«ధానంలో వైద్యం అందుతుందని సీఎం చంద్రబాబునాయుడు 2014 నవంబర్‌లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు, పెన్షనర్లకు కార్డులను కూడా జారీచేశారు. ఇవన్నీ ఇచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ హెల్త్‌కార్డుల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విధానం కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గరిష్టంగా రూ.2లక్షల వరకూ పొందేవారు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందించడానికి హెల్త్‌కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

నెలనెలా ప్రీమియం వసూలు
2014 నవంబర్‌ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెల రూ.90 రూ.120లను వారి వేతన శ్రేణిని బట్టి ప్రీమియం రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి వసూలు చేసిన మొత్తం ద్వారా దాదాపు రూ.350 కోట్లు ప్రభుత్వానికి జమవుతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయబట్టి మూడేళ్‌లైనా కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలలు హెల్త్‌కార్డుల ద్వారా వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో కొన్ని చిన్న వ్యాధులకు మాత్రమే వైద్యం అందుతుంది. దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్రచికిత్సలు చేస్తున్నారు తప్ప పెద్దవ్యాధులకు వైద్యం చేయడం లేదు. క్యాన్సర్, గుండె, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకూ ఉద్యోగులకు ఖర్చవుతుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్‌కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో పెన్షనర్లు ఉద్యోగులు ముందుగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురై అప్పులపాలవుతున్నారు.

జిల్లాలో ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్లుఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లావ్యాప్తంగా 35వేలమంది దాకా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ.90, 120 ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా గత మూడేళ్ల నుంచి తాము ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామని, అయినా నగదు రహిత వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

డబ్బులు కట్టి వైద్యం చేయించుకున్నా..
ప్రస్తుతం హెల్త్‌కార్డులు అమలుకాకపోవడంతో చాలామంది డబ్బులు కట్టి  వైద్యం చేయించుకుంటున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత మెడికల్‌ రీయింబర్స్‌ విధానం ద్వారా బిల్లులను సమర్పిస్తే ఒక్కో బిల్లుకు గరిష్టంగా రూ.2లక్షలను చెల్లిస్తున్నారు. ఆ మొత్తాలు కూడా ఏ ఆరునెలలకో ఏడాదికో మంజూరవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గడువును కూడా రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తూ ఉంది. ఆ గడువు కూడా మార్చి 31కి ముగియనుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)