amp pages | Sakshi

వెలుగులోకి టీడీపీ మరో అవినీతి బాగోతం..

Published on Sat, 01/18/2020 - 08:31

సాక్షి, అమరావతి బ్యూరో: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద వివిధ పనులకు ఏటా నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో వివిధ పనులు చేపట్టం ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అయితే జిల్లాలో  చేపట్టిన పనుల్లో నిధులు పెద్ద ఎత్తున దురి్వనియోగం అయినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ పథకంలో ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ (రోడ్డు పక్కల మొక్కల నాటడం)కు ఎక్కువ నిధులు విడుదలయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి 1,083 ఎకరాల్లో ఉద్యాన మొక్కల పెంపకానికి రూ.2.60 కోట్లు, 2018–19కి 2,987 ఎకరాల్లో నాటడానికి రూ.5.79 కోట్లు ఖర్చు పెట్టారు.

2017–18లో ఎవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించి 1,008 కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి మొక్కలు నాటేందుకు రూ.21.47 కోట్లు వెచ్చించారు. ఈ మొక్కలు నాటేందుకు గొయ్యి తవ్వడం, నిర్వహణ, సంరక్షణ, కాపలా వంటి వాటికి ఉద్యాన మొక్కలకు నెలకు 2017–18లో రూ.3 లక్షలు, 2018–19లో రూ.6 లక్షల చొప్పున, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు నెలకు రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటు నిధులు మంజూరు చేశారు. ఉదాహరణకు జిల్లాలో 2017–18లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద 4,50,370 మొక్కలు నాటాలని అంచనా వేయగా 4,31,110 మొక్కల నాటేందుకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో 4,03,176 మొక్కలు నాటినట్టు రికార్డుల్లో చూపారు.

ఇలా స్వాహా..! 
మొక్కలు కొనుగోలు చేయకుండానే చేసినట్టు.. నాటకుండానే నాటినట్టు.. నిర్వహణ చేయకుండానే చేసినట్టు.. మొక్కలు చనిపోయినా బతికే ఉన్నట్టు.. రికార్డుల్లో నమోదు చేశారు. విచిత్రమేమిటంటే.. మొక్కల రక్షణకు వేసే ట్రీగార్డులను మొబైల్‌ ట్రీగార్డులుగా వాడారు. ఒకచోట వేసిన ట్రీగార్డులనే అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్లి చూపేవారు. ఇలా కోట్లాది రూపాయలను స్వాహా చేశారు. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు సామాజిక తనిఖీ(సోషల్‌ అడిట్‌)ల్లో వెలుగు చూసింది. ఇందులో వెలుగు అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లు (ఏపీఎంలు), కమ్యూనిటీ కోఆర్డినేటర్లు(సీసీలు), వీవోలు, గ్రామైఖ్య సంఘాల సభ్యులు ఉన్నారని గుర్తించారు. 

రూ. 10కోట్లకు పైగానే.. 
ఈ మొత్తం వ్యవహారంలో రూ.10 కోట్లకు పైగానే అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా జిల్లాలోని 49 మండలాలకు గాను 38 మండలాల్లో రూ.2.38 కోట్లు స్వాహా అయినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా 11 మండలాల్లో సోషల్‌ ఆడిట్‌ పూర్తి కాలేదు. వాటిలో కూడా లెక్క తేలితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. కేవలం సోషల్‌ ఆడిట్‌ ద్వారానే రూ.2.38 కోట్లు స్వాహా జరిగినట్టు నిర్థారణ కాగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిపితే ఆ మొత్తం రూ.10 కోట్లకు పైగా ఉండవచ్చని అధికార వర్గాలే చెబుతున్నాయి.  

రికవరీ మొదలు.. 
ఈ స్వాహా పర్వంలో భాగస్వాములపై చర్యలు తీసుకోవడమే గాక వారు తిన్న సొమ్మును కూడా రికవరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇప్పటివరకు రూ.66 లక్షలకు వారు వివరణ ఇచ్చారు. రూ.8.69 లక్షల సొమ్ము రికవరీ చేశారు. మిగిలిన సొమ్ము రికవరీ కావలసి ఉంది.

విజిలెన్స్‌తో విచారణ.. 
ఈ అవినీతి వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తోంది. దీనిపై విజిలెన్స్‌ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.  

అవకతవకలు నిజమే..  
జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగినట్టు సామాజిక తనిఖీల్లో తేలింది. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. దీనిపై బాధ్యులకు నోటీసులు జారీ చేశాం. వీరిలో కొందరు తమ వివరణ ఇచ్చారు. ఇంకొందరి నుంచి రికవరీ చేస్తున్నాం. ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. నివేదిక వస్తే అక్రమాలకు బాధ్యులపై చర్యలు          తీసుకుంటాం.  
– శ్రీనివాస్, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)