రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీడీపీ నేతల ఆందోళన
Published on Thu, 12/20/2018 - 21:11
వైఎస్సార్ జిల్లా: టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం ఎదుట 15వ డివిజన్ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉంటే తమను కాదని పార్టీకి సంబంధం లేని వారికి పనులు ఎలా కేటాయిస్తారంటూ శ్రీనివాసులు రెడ్డిని నిలదీశారు. మర్యాదగా బయటకు వెళ్లాలని, ఏమి చేయాలో తనకు తెలుసునని ఆందోళన చేస్తున్న వారిపై శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారిమని తమను పక్కన పెడుతున్నారంటూ టీడీపీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అణాగారిన కులాలను పక్కన పెట్టి కబ్జాదారులకు, రౌడీలకు టీడీపీ జిల్లా నాయకులు పనులు అప్పజెప్పుతున్నారని మండిపడ్డారు. చేసేదేమీ లేక అక్కడి నుంచి కాసేపయిన తర్వాత వెళ్లిపోయారు.
#
Tags