amp pages | Sakshi

టీడీపీది క్షుద్ర రాజకీయం

Published on Tue, 03/05/2019 - 07:19

సబ్బవరం(పెందుర్తి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సానుభూతి ఓట్లు తొలగించే క్షుద్ర రాజకీయాలకు టీడీపీ తెరతీసిందని అ పార్టీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ధ్వజమెత్తారు. నియోజకవర్గం సబ్బవరం మండలంలో వైఎస్సార్‌ సీపీ నాయకుల పేరిట ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లే తొలగించాలని భారీ ఎత్తున దరఖాస్తులు రావడంపై అదీప్‌రాజ్‌ నేతృత్వంలో పార్టీ నాయకులు సోమవారం సబ్బవరం సీఐ ఎం.శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్‌ వరహాలుకు ఫిర్యాదులు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి కుట్రదారులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఓట్లు తొలగించి దొడ్డిదారిలో గెలవాలని టీడీపీ ఆలోచించడం సిగ్గుచేటన్నారు.

ప్రజల అభీష్టంతో నిజాయతీగా గెలవడం ఒక్క వైఎస్సార్‌ సీపీకే సాధ్యమన్నారు. టీడీపీవి మొదటి నుంచీ అడ్డదారి రాజకీయాలే అని ఎద్దేవా చేశారు. నీతిలేని రాజకీయాలకు టీడీపీ పెట్టింది పేరని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో తొలి నుంచి ఆయనకు అండగా ఉన్న వారిని ఇలా వేధించి మానసిక క్షోభకు గురిచేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎవరైనా తమ పార్టీ ఓట్లు తామే తొలగించుకుంటారా అని ప్రశ్నించారు. మూడు నాలుగు రోజులుగా మండలంలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను పట్టుకుని తగిన శిక్ష విధించాలని ఉన్నతాధికారులను కోరారు. ఎన్నికల సంఘం దీనిపై ప్రజలకు తగిన భరోసా ఇవ్వాలన్నారు. అదీప్‌రాజ్‌ వెంట పార్టీ నాయకులు కొటాన రాము, తుంపాల అప్పారావు, సబ్బవరపు ముత్యాలనాయుడు, వనం అచ్చింనాయుడు, పాలిశెట్టి సురేష్, బోకం రామునాయుడు, బోకం శ్రావణ్, వడ్డాది అప్పలరాజు, లగిశెట్టి కుమార్, కొటాన వెంకటరమణ, సత్యనారాయణరాజు, పెతకంశెట్టి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

రోజుకు 10 వేలకు పైనే దరఖాస్తులు
అర్బన్‌ ప్రాంతాల్లో అపార్టుమెంట్‌ పేరు, ప్రాంతం పేర్కొంటూ ఆ అపార్టుమెంట్‌లోని ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యంగా ఓట్ల దొంగలు చొరబడ్డారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నాటికి 74,848 దరఖాస్తులందగా, గడిచిన రెండు రోజుల్లో ఈ సంఖ్య 90 వేల దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్త ఓటర్ల నమోదు కోసం 2,03,169 దరఖాస్తులు, తొలగింపుల కోసం 64,240 దరఖాస్తులు అందాయి. కేవలం 24 గంటల వ్యవధిలో కొత్త ఓట్ల నమోదు కోసం 5,531 దరఖాస్తులు రాగా, తొలగింపుల కోసం ఏకంగా రెట్టింపు సంఖ్యలో 10,608 దరఖాస్తులందడం చూస్తుంటే ఏ స్థాయిలో తొలగింపుల కోసం వినతులు వెల్లువెత్తుతున్నాయో అర్థమవుతోంది.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)