amp pages | Sakshi

రైతు యూనిట్‌గా పంటల బీమా

Published on Thu, 02/19/2015 - 02:17

  • ఐసీఏఆర్ సమావేశంలో కేంద్రాన్ని కోరిన మంత్రి పోచారం
  • ఉద్యాన వర్సిటీకి కేంద్రం హామీ
  • వ్యవసాయానికి ‘ఉపాధి హామీ’
  •  సాక్షి, హైదరాబాద్: రైతును యూనిట్‌గా తీసుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) 86వ వార్షిక సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి ముందు ఉదయం మంత్రి నివాసంలో, అనంతరం కృషిభవ న్‌లో కేంద్ర వ్యవసాయశాఖమంత్రి రాధామోహన్‌సింగ్‌తో పోచారం రెండుసార్లు భేటీ అయ్యారు.

    కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హార్టికల్చర్ వర్సిటీ నిర్మాణం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. రైతు యూనిట్‌గా పంటల బీమాను అమలు చేసేందుకు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, సర్వే నంబర్ల ఆధారంగా బీమా చె ల్లింపు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని కోరాం.

    గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వ్యవసాయం నిర్వీర్యం కావడంతో రైతులు పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని, వీరంతా తిరిగి గ్రామాలకు వచ్చేలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాను.’ అని తెలిపారు. రాష్ట్రానికి ఉద్యాన వర్సిటీని మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్స్యశాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను సమావేశంలో పోచారం వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఏను వ్యవసాయానికి అనుసంధానిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ప్రతిపాదించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు పోచారం తెలిపారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)