రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిట్టితల్లికి.. ఊచ కష్టం..
Published on Thu, 04/23/2015 - 01:46
అనపర్తి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన గంగిరెడ్డి నర్సింగ్హోమ్ అధినేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బుధవారం ఒక చిన్నారి గొంతులో ప్యాలట్(అంగిడి) భాగాన గుచ్చుకున్న ఊచను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. రాజానగరం మండలం ముక్కినాడ గ్రామానికి చెందిన కొప్పుల మిత్రవింద (5) కొక్కెంతో ఉన్న సుమారు మూడడుగుల పొడవున్న ఇనుప ఊచతో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది.
ఊచ చివరి భాగాన ఉన్న కొక్కెం చిన్నారి అంగిడికి గుచ్చుకుంది. గొంతునుంచి రక్తస్రావం అవుతున్న ఆమెను త ల్లిదండ్రులు అనపర్తిలోని గంగిరెడ్డి నర్సింగ్హోమ్కు తరలించారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆపరేషన్ చేసి చిన్నారి గొంతులోంచి ఊచను తొలగించారు. మిత్రవిందకు ఇక ఇబ్బందేమీ లేదని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి విలేకరులకు చెప్పారు.
#
Tags