amp pages | Sakshi

ఇరిగేషన్‌ శాఖలో దొంగలుపడ్డారు..!

Published on Sun, 03/19/2017 - 20:15

తూర్పుగోదావరి(మలికిపురం): రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖలో దొంగలు పడ్డారని రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌, వైఎస్సార్‌సీపీ రాజోలు కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన ప్రాజెక్టులకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఆ నిధులను మంత్రులు పంచుకుంటున్నారని ఆరోపించారు.

రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 7వేల కోట్లు మంజూరు చేసి పూర్తిచేస్తే ఆ ప్రాజెక్టుకు పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పేరుతో మరో రూ. 2వేల కోట్లు మంజూరు చేసి ఆ నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేసుకున్నారని అన్నారు. గత ఏడాది పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రూ. 1700కోట్లు మంజూరు చేసి రాజశేఖరరెడ్డి తవ్వించిన పోలవరం ప్రాజెక్టులోకి నీరు తోడినట్లే పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారన్నారు.

పట్టిసీమతోపాటు, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు నిధులు కూడా గంగలో పోసినట్లేనని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని ఇరిగేషన్‌ శాఖలో ఖర్చు చేసి ముఖ్యమంత్రితో సహా, మంత్రులు దేవినేని, యనమల ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)